Congress : భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలి : కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
Mallikarjun Kharge : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇటీవల పాకిస్థాన్కు బెయిల్ఔట్ ప్యాకేజీలు, రుణాలు లభించిన సొమ్ము సైన్యం, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై వెచ్చిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పోషించే పాకిస్థాన్ను ఉగ్ర బాధిత దేశమైన భారత్తో పోల్చడం సరికాదన్నారు.
పాక్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ వైస్ చైర్మన్గా చేయడం.. తాలిబన్ శాంక్షన్ కమిటీకి 2025కు గాను అధ్యక్షత అప్పగించడాన్ని ఖర్గే తప్పుపట్టారు. ఇది పూర్తిగా దురదృష్టం, అవగాహన రాహిత్యం అన్నారు. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉగ్ర ఫైనాన్స్పై నిఘా కోసం పాకిస్థాన్ను ఆర్థిక కార్యదళం గ్రేలిస్ట్లో తిరిగి చేర్చాలని భారత్ డిమాండ్ చేసిందన్నారు. డిమాండ్లోని సహేతుకతను గమనించాలన్నారు. కేవలం భారత్ కోసం కాదని, అంతర్జాతీయ సమాజం ప్రయోజనాల కోసం అవసరమని చెప్పారు. మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాక్లోనే హతమయ్యాడన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేడా పాక్ కౌంటర్ టెర్రరిజం కమిటీకి నాయకత్వం వహించడాన్ని తప్పుపట్టారు. జూన్ 4న తాలిబన్ ఆంక్షల కమిటీకి పాక్ వైస్ చైర్మన్గా ఎన్నికైందని, ఇది మన విదేశాంగ విధానం విషాదగాథ. ప్రపంచ దేశాలు ఎలా అనుమతించాయని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.