Published On:

AAP: ఆమ్ ఆద్మీకి బిగ్ షాక్.. పెద్ద సంఖ్యలో నేతల రాజీనామా

AAP: ఆమ్ ఆద్మీకి బిగ్ షాక్.. పెద్ద సంఖ్యలో నేతల రాజీనామా

Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. పార్టీలోని 13 మంది కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆప్ సభా నాయకుడిగా ఉన్న ముఖేష్ గోయల్ తో పాటు.. మరో 12 మంది ఇవాళ పార్టీని వీడారు. వీరంతా కలిసి గోయల్ నేతృత్వంలో త్వరలోనే ఇంద్రప్రస్థ వికాస్ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు.

 

అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారం కోల్పోయాక ఆపార్టీలోని నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఆప్ లో అంతర్గత కలహాలు జరగడంతో ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. దీంతో సంస్థాగతంగా పార్టీలో మార్పులకు అధినేత కేజ్రీవాల్ శ్రీకారం చుట్టారు. పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

 

కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోయెల్ ఆదర్శ్ నగర్ స్థానం నుంచి ఆప్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 25 ఏళ్లు మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసిన గోయల్ 2021లో కాంగ్రెస్ నుంచి ఆప్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్టీని వీడుతున్న నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ ముఖ్య నేతలతో తమను పట్టించుకోవడంలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కు రాజీనామా లేఖను పంపారు.