Last Updated:

Delhi Assembly Election Results 2025: ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. అరవింద్ కేజ్రీవాల్ ఘోర ఓటమి

Delhi Assembly Election Results 2025: ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. అరవింద్ కేజ్రీవాల్ ఘోర ఓటమి

Arvind Kejriwal Loses New Delhi in Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందారు. తన సమీప అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను ఓడించారు. అలాగే, జంగ్‌పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోదియా ఓటమి చెందారు. ఈ మేరకు సిసోదియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.

అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి న్యూఢిల్లీ స్థానంలో పోరు రసవత్తరంగా సాగింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మధ్య గట్టి డోబుచులాట జరిగింది. కానీ చివరికి కేజ్రీవాల్ ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను 3,182 ఓట్ల తేడాతో ఓడించారు. కాగా, న్యూఢిల్లీ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన కేజ్రీవాల్.. నాలుగోసారి ఓడిపోయారు. వరుసగా పట్టం కట్టిన ప్రజలు ఈసారి ఆయనను తిరస్కరించారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ కాపాడుకోలేకపోవడం వంటి కారణాలతో ప్రజలు ఓట్లు వేయలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఆప్ పార్టీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా కొనసాగుతోంది. ఆప్ పార్టీకి చెందిన అగ్రనేతలు సైతం బీజేపీ నేతల చేతుల్లో మట్టి కరిగిపోతున్నారు. ఇప్పటివరకు బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ 21 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ రెండు స్థానాల్లో గెలుపొందగా.. ఆప్ కూడా రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఇప్పటివరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం.