Home / తప్పక చదవాలి
సొంత చిన్నమ్మ లెటర్ రాస్తే కూడా పట్టించుకోని జగన్ నీది గుండెనా .లేక్ బండనా అంటూ అన్న జగన్ పై వైఎస్ షర్మిల విరుచుకు పడింది . గురువారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షర్మిల ఏపీ ,సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టింది .
బిహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాట్నా రైల్వే స్టేషన్కు సమీపంలో గురువారం హోట్లో లోపల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. వారిలో ముగ్గురు మహిళలున్నట్లు పాట్నా పోలీసులు తెలిపారు. పాట్నా జంక్షన్ సమీపంలో ఉన్న ఈ హోటల్లో సహాయక చర్యలు చేపట్టామని సిటి సెంట్రల్ ఎస్పీ చంద్రప్రకాశ్ చెప్పారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ముస్లిం రిజ్వేషన్లను రద్దు చేస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా గురువారం నాడు తెలంగాణలోని సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. దీనికి బదులుగా ఎస్సీ, ఎస్టిలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూరుస్తామన్నారు.
ఏపీ సీఎం జగన్ పై అయన సోదరి ,వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .జగన్ తలపై బ్యాండేజి తీ సివేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు .గాలి ఆడకుండా ఎక్కువ కాలం ఉంటే గాయం మానదని అన్నారు .అలాగే ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఒక డాక్టర్ గా చెబుతున్నానని అన్నారు .పులివెందుల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.
అవినీతి మయమైన వైసీపీ ని పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .గురువారం సాయంత్రం రాజం పేట జిల్లా రాజం పేటలో కూటమి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు .మన రాష్ట్రం,మన నేల ,మన ప్రజలు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదని కూటమి కట్టామని అన్నారు .
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.
బీజేపీపై నయవంచన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. గురు వారం గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ ఈ ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 40కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని..గొప్పులు చెప్పే బీజేపీ ఏ ఒక్క పేదవారి ఖాతాలో చిల్లిగవ్వ కూడా వేయకుండా మోసం చేసిందని అన్నారు .
పీఎల్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉప్పల్ హెచ్ సి ఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది .ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి .. ఆధ్వర్యంలో ధర్నాచేసారు.
తెలంగాణ లో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం మొదలు పెట్టిన యాదాద్రి ధర్మల్ విద్యుత్కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది .ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు విమర్శించడం గమనార్హం .దీని వలన లాభం కంటే నస్టమే ఎక్కువని అనవసరంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టు ప్రారంభించారని చెబుతోంది.
ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి ఏ కె ఆంటోని ఉన్నారని ఆయన కుమారుడు, పతనంతిట్ట నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అనిల్ కె ఆంటోని వ్యాఖ్యానించారు.వ్యక్తిగతంగా తన తండ్రి ఎకె ఆంటోని అంటే తనకు అత్యంత గౌరమని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన కామెంట్ చేసారు. .