Home / తప్పక చదవాలి
మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్లో ఆడే క్రెకటర్లు కోటీశ్వరులని చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఈ ఆటతో అనుబంధం ఉన్న వారు కూడా బాగానే సొమ్ములు వెనకేసుకుంటారు. తాజాగా మాజీ క్రికెట్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్కు స్కై స్పోర్ట్స్ నుంచి క్రికెట్కు సంబంధించి కామెంటరీ చేయాలని ఆఫర్ వచ్చింది. దీనికి సెహ్వాగ్ రోజుకు తనకు 10వేల బ్రిటిష్ పౌండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
పతినే ప్రత్యక్ష దైవంగా భావించిన భార్య భర్త చనిపోయిన తర్వాత గుడి కట్టిన సంఘటన ఆసక్తిగా మారింది .మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ,సోమ్లాతండాకు చెందిన బానోతు హరిబాబు, కల్యాణి దంపతలు. వీరికి 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది . పిల్లలు కలగ లేదు.
ఏపీ సీఎం జగన్ కు తన చిన్నమ్మ ,వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు .ఇప్పటి వరుకు వివేకానంద రెడ్డి హత్య కు సంబంధించి అయన సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పటివరకు జగన్కు లేఖ రాయడం కానీ ,జగన్ ను విమర్శించడం గాని చేయలేదు . తొలిసారి గా సౌభాగ్యమ్మ లేఖ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది .
పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.
కెన్యాలో భారీ వర్షాలకారణంగా ఇప్పటివరకూ 38 మంది మరణించారని కెన్యా రెడ్క్రాస్ సొసైటీ ( కెఆర్ సి ఎస్ ) ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీ, మాథారే మురికివాడల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు.
మేము ఓడితే నాకు కానీ చంద్ర బాబు కు ఏమి కాదు .కాని రైతులు,కార్మికులు ,విద్యార్థులు దెబ్బతింటారు .ఇది చూస్తూ నేను ఉరుకోలేను .అందుకే కూటమి కట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ-జనసేన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల లో జ్యూట్ మిల్లు ను తెరిపిస్తామని చెప్పారు..
దేశంలో క్షీణిస్తున్న జనన రేటును పెంచే ప్రయత్నంలో జన్మించిన ప్రతి శిశువుకు తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకాలను చెల్లించాలని దక్షిణ కొరియా పరిశీలిస్తోంది.దక్షిణ కొరియా ప్రభుత్వ అవినీతి నిరోధక మరియు పౌర హక్కుల కమిషన్ దీనిని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఒక పబ్లిక్ సర్వేను నిర్వహిస్తోంది.
:కేరళలో అలప్పుజ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఇండియా కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న పోటీ వట్టి బూటమని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఒక స్టేజీపైకి వచ్చి చేయి చేయి కలుపుతారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం రాజస్థాన్లోని బాంస్వారాలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. ఇక మోదీ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే.. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని సంపదతో పాటు తల్లుల, సోదరి మణుల బంగారం లెక్క వేసి దేశంలోకి అక్రమ చొరబాటు దారులకు... ముస్లింలకు సమానంగా పంచుతామని ప్రకటించింది.
కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.