Last Updated:

Vande Bharat Express: తెలంగాణకు రానున్న మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్

తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు 8గంటల 30 నిమిషాలలో చేరుకోనుంది.

Vande Bharat Express: తెలంగాణకు రానున్న మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat Express: తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు 8గంటల 30 నిమిషాలలో చేరుకోనుంది.

530 మంది ప్రయాణీకులతో..(Vande Bharat Express)

హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం మీదుగా కాచిగూడ మరియు యశ్వంతపూర్ మధ్య నడపబడుతుంది. ఈ రైలులో 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 7 చైర్ కార్ కోచ్‌లు, 530 మంది ప్రయాణీకుల సీటింగ్ కెపాసిటీతో ఉంటాయి. ఈ మార్గంలోని ఇతర రైళ్లతో పోల్చినప్పుడు ఇది రెండు నగరాల మధ్య అతి తక్కువ ప్రయాణ సమయంతో అత్యంత వేగవంతమైన రైలు అవుతుంది. అదేరోజు విజయవాడ – ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడ ప్రారంభిస్తారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట మీదుగా నడపబడుతుంది. ఈ రైలులో 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్ మరియు 7 చైర్ కార్ కోచ్‌లు 530 మంది ప్రయాణీకుల సీటింగ్ కెపాసిటీతో ఉంటాయి. విజయవాడ మరియు చెన్నై మధ్య ఈ మార్గంలో ఇది మొదటి వేగవంతమైన రైలు అవుతుంది.