Last Updated:

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేస్.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేస్.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.

కీలక విషయాలు వెలుగులోకి.. (TSPSC Paper Leak)

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి.

ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

మరిన్ని విషయాలను రాబట్టేందుకు.. సిట్ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారని తెలిసింది. దీంతో ఇప్పటివరకు నలుగురు కమిషన్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

A-1 గా ప్రవీణ్, A-2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్, A-10 షమీమ్ ASO, A-12 రాజశేఖర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు.

నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారులు పేర్కొన్నారు.

ప్రధాన సాక్షిగా శంకర్ లక్ష్మి..

నిందితుల విచారణలో ప్రధాన సాక్షింగా టీఎస్ పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని వెల్లడించారు.

శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొన్నారు. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని సాక్షిగా పేర్కొన్నారు.

హోటల్ లోని సీసీటీవి కెమెరాలో పేపర్ ఎక్సెంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను సిట్ అధికారులు ఆరెస్ట్ చేశారు.

ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాదినం చేసుకున్నారు.

గ్రూప్-1లో 127 మార్కులు వచ్చిన షమీమ్ అనే నిందితుడు, 122 మార్కులు సాధించిన మరో నిందితుడు రమేశ్ సహా సురేశ్ అనే మరో నిందితుడిని పోలీసులు నిన్న అరెస్టు చేశారు.

వారిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకి తరలించారు.

రమేశ్, సురేశ్, షమీమ్ 14 రోజులు రిమాండ్ లో ఉండనున్నారు. అంతకముందు 9 మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

నిందితుడు రమేశ్ టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.