South Central Railway: చర్లపల్లి-నర్సాపూర్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడగింపు!
Good news for Passengers from South Central Railway: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి, జాల్నా-తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. చర్లపల్లి-నర్సాపూర్ (07233) రైలు ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7కి గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. నర్సాపూర్-చర్లపల్లి 07234 నంబర్ రైలు ప్రతి ఆదివారం రాత్రి 8కి బయల్దేరి ఉదయం ఏడు గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది. జాల్నా-తిరుపతి (07609) రైలు ప్రతి సోమవారం ఉదయం అందుబాటులో ఉంటుందని తెలిపింది. జాల్నా రైల్వే స్టేషన్లో ఉదయం 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని చెప్పింది.
తిరుపతి-జాల్నా రైలు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 3.50 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి రైలు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, విరసవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
జాల్న-తిరుపతి-జాల్నా రైలు పార్తూర్, సేలు, మన్వత్రోడ్, పర్బణి, గాంఖేర్, పర్లి వైద్యనాథ్, లాతూర్ రోడ్డు, ఉద్గిర్, బీదర్, మర్పల్లి, వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఆయా రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ తరగతి, జనరల్ సెకండ్ తరగతి కోచ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.