Published On:

KTR on KCR Notice: నిజాలు నిలకడ మీద తెలుస్తాయి: కేటీఆర్!

KTR on KCR Notice: నిజాలు నిలకడ మీద తెలుస్తాయి: కేటీఆర్!

KTR comments on Kaleshwaram Notice to KCR: కాళేశ్వరంలో నిజాలు నిలకడ మీద తెలుస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బిజేపీ, కాంగ్రెస్ చేస్తున్న పాలిటిక్స్ దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్‌కు కేసీఆర్ కట్టిన ఆనవాళ్లే కదా చూపించిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో రాద్ధాంతం చేసిన ప్రభుత్వం SLBC సంగతేంటన్నారు. ఫార్ములా ఈ-రేస్ ఒక డ్రామా అని కేటీఆర్ కొట్టపారేశారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై వేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని.. కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్బుతం అని సుప్రీం కోర్టు కితాబిచ్చిందని కేటీఆర్ అన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడులా వ్యవహరిస్తున్నారని అన్నారు కేటీఆర్. ఒక సారి అప్పు పుట్టడం లేదని మరోసారి 60వేల కోట్ల అప్పు తీసుకోచ్చానని అంటున్నారని విమర్శించారు. నెలరోజులుగా సీఎం రేవంత్ వరల్డ్ బ్యూటీస్ ప్రోగ్రామ్ అప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడంలేదని చెప్పారు. అప్పుడు మేము కట్టిన కట్టడాల ముందు ఇప్పుడు వరల్డ్ బ్యూటీస్ ఫొటోలు దిగుతున్నారని రేవంత్ చేసిందేమీలేదని విమర్శించారు.

ఇవి కూడా చదవండి: