Published On:

BRS: బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

BRS: బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: కొంతకాలంగా బీఆర్ఎస్ కు అంటీ ముట్టనంటూ ఉంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ జరిగిందని, తాను వద్దని వాదించానని కవిత సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం విషయంలో నోటీసులు వస్తే పార్టీలో చర్చ జరగలేదని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయలేదని కవిత అన్నారు.

 

తాజాగా కేసీఆర్ కు ఆమె రాసిన లేఖపై కవిత మాట్లాడారు. తన తండ్రికి మాత్రమే లేఖ రాశానని, పార్టీ అధ్యక్షుడికి కాదని ఆమె అన్నారు. తన తండ్రికి 100 లేఖలు రాసుకుంటానని, ఎవరికి ఏం నష్టం వచ్చిందని ఆమె నిలదీశారు. పార్టీలో చాలా విషయాలు చర్చిస్తానని బహిరంగంగా చెప్పారు. కేసీఆర్ కు నోటీసు వస్తే పార్టీ నేతలు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ప్రతిపక్ష పార్టీగా ఏం చేశారని కవిత మండిపడ్డారు. ఎక్కడికక్కడ నిరసనలు చేయాల్సింది కానీ అలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని నిలదీశారు.

 

బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ వల్లనే సక్సెస్ అయిందని, కొందరు తమ వల్లే సభ విజయవంతం అయిందని చెప్పుకుంటున్నారని కవిత ఆరోపించారు. బీజేపీ వాళ్లు హాస్పిటల్ పెడితే వెళ్లింది ఎవరని, తాను అలా వెన్నుపోటు రాజకీయాలు చేయనని కవిత చెప్పుకొచ్చారు. ధైర్యంగా మాట్లాడుతానని, నల్లిక కుట్ల రాజకీయాలు చేయనని.. లేఖ రాసింది ఎవరో తెలవాలని ఆమె డిమాండ్ చేశారు. పెయిడ్ పోస్టులతో బదనాం చేస్తే ఊరుకోనని బీఆర్ఎల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.