Harish Rao : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.. మండిపడ్డ మంత్రి హరీశ్రావు

Former Minister Harish Rao : తెలంగాణకు మంజూరైన నరేగా పని దినాలను కేంద్రం సగానికి తగ్గించడం శోచనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేయగా, సీఎం రేవంత్రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా సాధించిందేమీ లేదని మండిపడ్డారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెరో 8 సీట్లు వచ్చానా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రానికి జరిగే అన్యాయంపై స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. నాలుగు నెలలుగా ఉపాధిహామీ కూలీలకు వేతనాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. కూలీల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నరేగా పని దినాలను పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నాలుగు నెలల జీతాలు చెల్లించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.