Minister KTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు.

Minister KTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి..(Minister KTR)
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న తమ యంగర్ బ్రదర్ వైజాగ్, తోటి రాష్ట్రం ఏపీకి శుభాకాంక్షలు అని చెప్పారు. ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్టుగా పేర్కొన్నారు. రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని.. భారతదేశంలో అత్యుత్తమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హైదరాబాద్ను ఏపీకి బిగ్ బ్రదర్గా అభివర్ణించారు. ఈ నేపధ్యంలో కేటీఆర్ ఈ విధంగా ట్వీట్ చేసారు.
40 దేశాల నుంచి రాయబారులు.. 25 దేశాల ప్రతినిధులు..
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు సుమారు 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికలను సిద్దం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఏడుగురు కేంద్ర మంత్రులు, 40 దేశాల నుంచి రాయబారులు, 25 దేశాల ప్రతినిధులు.. మన దేశానికి చెందిన 30 మంది పారిశ్రామిక దిగ్గజాలు రాబోతున్నారు. మార్చి 3న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్రెడ్డి పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సమ్మిట్ మంచి వేదిక కానుంది.
కాగా ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం సుమారు వంద కోట్లతో విశాఖ నగరాన్ని సుందరీకరించారని సమాచారం అందుతుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. అలానే ప్రత్యేక అతిథులుగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, బజాజ్ ఫిన్సర్వ్ ఎండీ, సీఈవో సంజీవ్ బజాజ్, జేఎస్డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నవీన్ జిందాల్.. పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
ఈ క్రమంలోనే సమ్మిట్ జరిగే ఏయూ నుండి విమానాశ్రయం వరకు, బీచ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల తాకిడి దృష్ట్యా.. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. ఇక, శుక్ర, శనివారాలు బీచ్ కు వెళ్లేవారు తమ వాహనాలను ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలని సూచించారు సీపీ శ్రీకాంత్. సమ్మిట్ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ పరిసరాల్లో వీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకాలు సాగించాలని సూచించారు. ముఖ్యంగా బీచ్ రోడ్లో ట్రాఫిక్ జాం లేకుండా ఉండేలా చూస్తామన్నారు శ్రీకాంత్. ఈ రెండు రోజులూ ఎపిఐఐసి గ్రౌండ్స్లో తమ వాహనాలను పార్క్ చేయాలని కోరారు.
Good luck to our younger brother Vizag & sister state AP as they conduct their Global Investors Summit
I wish them the very best
May both Telugu speaking states prosper and be the best in India pic.twitter.com/v6UhGlZ7qP
— KTR (@KTRBRS) March 2, 2023
ఇవి కూడా చదవండి:
- Gold Prices: తగ్గినట్టు అనిపించి మళ్లీ పెరిగిన బంగారం ధరలు
- IRCTC HDFC Credit Card: రైలు ప్రయాణికుల కోసం సరికొత్త క్రెడిట్ కార్డు
- Global Investors Summit 2023 : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు సిద్దమైన విశాఖ.. పోలీసుల భద్రతా వలయంలో కట్టుదిట్టంగా!