Home / ప్రాంతీయం
Three students died: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగంది. వి. కోట మండలం మోట్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సరదాగా ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి నీటిలో మునిగిపోగా.. ఒకరి తర్వాత ఇంకొకరు కాపాడబోయి ముగ్గురు చనిపోయారు. చనిపోయిన విద్యార్థులను కుషాల్, నిఖిల్, జగన్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు మొక్కలు నాటారు. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ, అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. […]
Police Registered Case: మాజీ మంత్రి , వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో నిన్న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అంబటి రాంబాబు పోలీసలతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా నిన్న పట్టాభిపురం సీఐపై ‘నీ అంతు చూస్తాను’ అంటూ పరుష పదజాలంతో అంబటి […]
Police Filed case: తమ గ్రామాల పరిధిలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిన్న ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. గాయత్రి కంపెనీకి చెందిన ప్రతినిధులు వ్యవసాయ భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు చేస్తున్నారని తెలుసుకుని మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంపెనీ నిర్వహిస్తున్న పనులను అడ్డుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీకి సంబంధించిన ఆస్తులకు నిప్పుపెట్టారు. […]
No Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ప్రతి ఏడుకంటే ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాల్లోకి కూడా అదే జోరుతో వ్యాపించాయి. రుతుపవనాలు వచ్చిన రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు బాగానే పడతాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. వానలు కురవడం మాట పక్కన పెడితే.. ఎండలు మాత్రం రోజురోజుకు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు […]
Fish Prasadam Nampally Exhibition in Hyderabad: హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 8, 9 తేదీల్లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. రోగుల కోసం 32 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుండగా.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, అంధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభావర్ పరిశీలించారు. కాగా, చేప మందు పంపిణీ చేసేందుకు […]
Telangana Cabinet meeting at Secrateriat: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అయితే కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై అజెండా ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుందని తెలుస్తోంది. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ […]
Vanamahotsavam At Amaravati: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించనుంది. అనంతవరంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం అక్కడ మొక్కలు నాటనున్నారు. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో […]
Seven IPS officers Transfered: తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా, ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా శిఖా గోయల్ కొనసాగనున్నారు. హైదరాబాద్ సిటీ ఎస్బీ డీసీపీగా ఉన్న చైతన్యకుమార్ ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించింది. ఇప్పటి వరకు […]
4 Dead in Road Accident Sri Potti SriRamulu Nelluru District: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండంలోని ఏఎస్ పేట అడ్డరోడ్డు సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా దినసరి కూలీలుగా గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు వారు వెంటనే […]