Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. వై ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.
క్రికెట్ బెట్టింగ్ విన్నాం..... రాజకీయాల్లో ఏ నాయకుడు గెలుస్తాడో చేసిన చాలెంజ్ లు విన్నాం. కానీ వినూత్నంగా ఐదేళ్ల క్రితం ఓ ఆడపడుచు చంద్రబాబు గెలుస్తాడని కుటుంబసభ్యులతో చాలెంజ్ చేసింది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి అయ్యన్న ఏడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
ఆ ఊరులో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుతీర్చుకుంటే మాములు విషయమే కదా అని అనుకుంటే పొరపాటే ..ఆ మొక్కుకు ఒక లెక్కవుంది
సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతల ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా..60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణం గూడ్స్ రైలు కంచన్జుంగ ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి ఢీ కొట్టడమని పోలీసులు వివరించారు.
ఏపీలో రుషికొండ మహల్ హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలో నివాసముంటాననుకున్న మాజీ సీఎం జగన్ ఇంటి ఆర్భాటాలు విస్మయపరుస్తున్నాయి. ఇదేదో సాదాసీదా భవనం కాదు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది .మంత్రి పదవుల పందారం పూర్తయింది .శాఖలు కేటాయించారు .ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు .
ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ ఏంటో స్పష్టం చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు .5 హామీలపై అమలుపై స్పష్టమైన ప్రణాళికతో, వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు