Home / ప్రాంతీయం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో విపక్ష మహిళా నేతలే టార్గెట్గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి
నిబంధనలకు విరుద్ధంగా ఉందని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్డిఏ అధికారులు కూల్చేశారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చోపెట్టారు. 16వ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్లో వాలంటీర్ల ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ పోచారం నివాసాన్ని సందర్శించారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండున్నరేళ్ల క్రితం అంటే 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు తీవ్రంగా కించపరిచారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.