Home / ప్రాంతీయం
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. కాగా, ఈ పోటీలు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మే 10వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, ఈ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 110 దేశాల భామలు పోటీ పడుతుండగా.. 150కు పైగా దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఇందులో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉండడం విశేషం. […]
AP: ఏపీ సీఎం చంద్రబాబు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా వారికి పెన్షన్ ఇవ్వనున్నారు. అనంతరం బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో సమావేశం కానున్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుంటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ […]
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగుపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏసీఎం సభ్యులు, నలుగురు పార్టీ క్యాండేట్లు, మిగతా వారు పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయినవారికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆపరేషన్ కర్రిగుట్టలో […]
CN Chandrababu: రేపు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం ముమ్మిడివరం చేరుకోనున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి 12 గంటల 25 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటల 50 నిమిషాలకు సిహెచ్. గున్నేపల్లి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద […]
Minister Nadendla Manohar holds review with Collectors and Civil Supplies Department officials : ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీ నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీకి సిద్ధం […]
Union Minister Kishan Reddy : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంతో దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. భారత్కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం సిగ్గు చేటన్నారు. శుక్రవారం ఢిల్లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా […]
CM Chandrababu Naidu participates in CII annual conference : సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలు, ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయని […]
Bayya Sunny Yadav: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను NIA అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల బైక్పై పాకిస్తాన్ టూర్కు సన్నీ యాదవ్ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా తరహాలో గూడచర్యం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్ను లాహోర్లో కలిసినట్టు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. ఏడు నెలల క్రితం ఓ కార్యక్రమంలో జకీర్ నాయక్తో భయ్యా సన్నీ యాదవ్ పాల్గొన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. […]
TPCC Chief Mahesh Kumar Goud : బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కిషన్రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు చేశారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజీ అందిందో బహిర్గతం చేయాలన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ […]
KCR, Harish Rao meet at Erravelli Farmhouse : సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం భేటీ అయ్యారు. మూడున్నర గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ చర్చించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 5వ తేదీన కేసీఆర్, 9న మాజీ మంత్రి హరీశ్రావు, […]