Home / ప్రాంతీయం
Car Accident in Paradise Flyover: సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న మరొక కారు డివైడర్ను ఢీకొని మరో కారును ఢీకొట్టింది. కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఫ్లైఓవర్ పైకి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొట్టడంతో కారు చక్రాలు ఊడిపోయాయి. వెనకే వచ్చిన స్విఫ్ట్ […]
Harish Rao Presentation on Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఏపీ జలదోపిడీకి కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన హరీష్ రావు.. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం మాట సాయం, మూట సాయం చేయలేదన్నారు. కానీ ఏపీకి మాత్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని.. ఇప్పుడు బనకచర్లకు నిధులు ఇచ్చి సాయం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ మీద శ్రద్ద […]
Rs 4.5 Crores Theft in Nellore: కారులో తరలిస్తున్న 4.5 కోట్ల రూపాయిల నగదు మాయమైంది. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సరిహద్దులో విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి రూ.4.5 కోట్ల సొత్తును ఢిల్లీ నుంచి చెన్నైకి కారులో డ్రైవర్, గుమస్తాకు ఇచ్చి పంపించారు. నగదుతో ఉన్న ఆ కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్ఎస్ సిగ్నల్ […]
CPI State Secretary and MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పనికిరాదని, ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. హనుమకొండ జిల్లా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని కోరారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నోరు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించారని, ఇప్పుడు తనకు […]
BRS Chief and former CM KCR Visited 2nd time to AIG Hospital: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్తో కేటీఆర్, హరీశ్రావు ఆసుప్రతికి వచ్చారు. కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీకి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. శుక్రవారం కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. […]
Man Died in Aleru MLA Beerla Ilaiah’s Home: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలోని పెంట హౌస్లో అద్దెకు ఉంటున్నాడు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండురోజులుగా మృతుడి సొంత గ్రామం సైదాపురంలోనే ఉన్న అతడు ఎమ్మెల్యే నివాసంలో ఉరేసుకొని […]
New Creature in Found in Seshachalam Reserve Forest: తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్లోని జీవావరణంలో అరుదైన కొత్త జీవిని కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జాతి స్కింక్ (నలికిరి)ను కనుగొన్నట్లు పేర్కొన్నారు. అరుదైన జీవికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్గా పేరు పెట్టారు. పాక్షిక పారదర్శక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలి ఉంటుంది. కొత్త జాతి ప్రస్తుతం […]
Balmuri Venkat Filed a case on BRS Working President KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. […]
Gaddar Film Awards 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నేడు(శనివారం) హైటెక్స్లో వైభవంగా జరగనుంది. కొన్నేళ్లుగా సర్కారు నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగలేదు. దీంతో కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 ఏడాదికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో […]
Mahesh Goud: డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీలో, ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తుందన్నారు ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించినట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం […]