Home / ప్రాంతీయం
Doctor arrested Drug Case in Hyderabad: ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. సదరు వైద్యురాలు డ్రగ్స్కు బానిస అయ్యింది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని షేక్పేటలో ఏపీఏహెచ్సీ కాలనీకి చెందిన డాక్డర్ చిగురుపాటి నమ్రత(34) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]
Accident on the Hyderabad Outer Ring Road: పెద్దఅంబర్పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని కారు ఢీకొట్టిగా, మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరొకరిని మంటల […]
Operation Kagar is on Hold amid Operation Sindoor: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్పై ‘ఆపరేషన్ సిందూర్‘ ఎఫెక్ట్ పడింది. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మావోల ఏరివేతకు కర్రెగుట్టను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కర్రెగుట్టల్లో మావోల వేటకు బ్రేక్ పడింది. […]
AP High Court Key Statements about YS Jagan Filed Petition His Z+ Category: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లో తనకు జెడ్ప్లస్ భద్రత పునరుద్ధరించేలా, ఎన్ఎస్జీ లేదా సీఆర్పీఎఫ్ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తామని […]
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఈవెంట్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందాల భామలు పోటీలో పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అతిథులకు, పోటీదారులకు నగరంలోని పలు హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అలాగే ఆయా హోటళ్ల వద్ద భారీ భద్రత కల్పించారు. […]
Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రవ్యాపంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖ-అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి […]
Telangana: భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక దళాలు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్స్, మిసైళ్లతో భారత్ పై దాడులు చేస్తోంది. కాగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ చెందిన మిస్సైళ్లను నేలమట్టం చేస్తోంది. మరోవైపు సరిహద్దు వెంబడి పాక్ సైన్యాలకు కాల్పులకు పాల్పడుతున్నాయి. వీటిని భారత్ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇక భారత్- […]
Shamshabad Airport : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వేళ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. విమానాశ్రయంలో బాంబు పెట్టమంటూ అధికారులకు మెయిల్ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణను పెంచారు. 24గంటల పాటు డేగ కన్నుతో ఎయిర్ పోర్టుకు […]
CM Chandrababu inspects Handreeniva Sujala Sravanti works : భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఛాయాపురం ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్పై దాడులు చేసిందన్నారు. ఇండియాపై దాడులు చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాక్ దాడుల్లో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. […]
India- Pak War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పై పాక్ దాడులకు పాల్పడింది. డ్రోన్స్, క్షిపణులతో అటాక్ చేస్తోంది. కాగా పాక్ మిస్సైల్స్, డ్రోన్స్ ను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. సరిహద్దు వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతోంది. వీటిని భారత జవాన్లు ధీటుగా తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో భారత సైనికులు […]