Home / ప్రాంతీయం
Telangana: రాష్ట్ర ప్రభుత్వం జీపీవో పోస్టుల పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలోనే గ్రామ పాలనాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేసింది. పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆసక్తి కలిగిన వారి చేత కాన్సెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వారికి లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు. కాగా ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3550 […]
Hari Hara Veera Mallu Producer A.M.Rathnam Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఏఏం రత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నిర్మాణ సంస్థ ఓ పోస్టు షేర్ చేసింది. ఇందులో 17వ శతాబ్దానికి సంబంధించిన స్టోరీతో సినిమా చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. అంతేకాకుండా, సినిమా టికెట్ల […]
AP: జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత పథకం డబ్బులు అకౌంట్లలో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా త్వరలోనే సంక్షేమ కేలండర్ ను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి మహానాడు, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు […]
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెల్లని రూపాయి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కుటుంబంపై ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించారు తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను కేసీఆర్ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపారని తెలిపారు. కాగా కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రంలో […]
Makthal MLA Vakiti Srihari Road Accident: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటన షాద్నగర్ ప్రాంతంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి […]
Bhadradri: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో కర్రెగుట్టలు, నారాయణపూర్ మాధ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు, మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో పలువురిపై భారీగా రివార్డులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం […]
Telangana: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గాను దోస్త్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ లో 89,572 మంది విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 60,436 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. ఈ మేరకు దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కోటాయింపుపై ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి వివరాలు తెలిపారు. అయితే ఈసారి డిగ్రీలో కామర్స్ కోర్సుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. […]
Miss World Grand Final – 2025 In Hyderabad: హైదరాబాద్తో మిస్ వరల్డ్ – 2025 గ్రాండ్ ఫైనల్స్ శనివారం జరగనున్నాయి. ఈ మేరకు నగరంలోని హైటెక్స్ వేదిక అంగరంగవైభవంగా ముస్తాభైంది. ఈ పోటీలను మొత్తం 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పోటీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై తిలకించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, ఈ పోటీల్లో […]
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్- దక్షిణ ఛత్తీస్ గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, […]
Piligrims: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు వేసవి ముగింపు దశకు చేరుకోవడం, విద్యార్థుల ఫలితాలు వెలువడటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరగుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసింది. దీంతో వైకుంఠం క్యూ క్లాంపెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. చివరికి వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల […]