Published On:

AP Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం అప్డేట్.. ఇలా చేస్తే నేరుగా ఖాతాల్లోకి రూ.15వేలు

AP Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం అప్డేట్.. ఇలా చేస్తే నేరుగా ఖాతాల్లోకి రూ.15వేలు

Documents for Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ నెలలోనే ఈ పథకం ప్రారంభిస్తున్నందున డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి సంబంధించి బ్యాంక్, ఆధార్ నంబర్లను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

 

పథకం ప్రారంభ తేదీ: జూన్ 12, 2025.

లబ్ధిదారులు: 1వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు.

ఆర్థిక సహాయం: ప్రతీ ఏడాది 15వేలు. తల్లులకు ఆర్థిక సహాయం, పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు.

 

అర్హతలు:

  • ‘తల్లికి వందనం’ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఏపీకి చెందిన వ్యక్తులు ఉండాలి.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉండాలి. 1వ నుంచి 12వ తరగతి వరకు అర్హులుగా గుర్తించారు. వీరంతా కనీసం 75శాతం హాజరు కలిగి ఉండాలి.
  • తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడంతో పాటు కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.

 

 

పథకానికి కావాల్సిన పత్రాలు:

  •  విద్యార్థి చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్
  •  విద్యార్థి తల్లి ఆధార్ కార్డు
  •  విద్యార్థి తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు
  •  నివాస పత్రం లేదా రేషన్ కార్డ్
  •  కుల ధ్రువీకరణ పత్రం
  •  అవసరమైతే ఆదాయ సర్టిఫికెట్
  •  పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్

 

విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15వేలు జమ కానున్నాయి. ఈ పథకం కింద డబ్బులు త్వరగా పడేందుకు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్‌తో పాటు ఎన్‌పీసీఐను జూన్ 5 లోగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లింక్ చేయని యెడల లింక్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.