Home / ap news
AP CM Chandrababu, Ministers Statemets Sbout AP annual budget: ఏపీ శాసనసభలో రూ.3.22లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. […]
Police Notice To YCP Ex MP Gorantla Madhav: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీసీ నేత గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతోపాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై […]
AP Police arrest Posani Krishna Murali: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నివాసంలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతపురం తరలించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం రాజంపేట మెజిస్ట్రేట్ […]
MLC Election Campaign Ends in AP and Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఎక్కడికక్కడ మైకులు మూగబోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీలో 3, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 8, 9 తేదీల్లో […]
Elephants Attack on Devotees in Annamaiya District: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఏనుగుల దాడిలో ఐదుగురు భక్తులు మరణించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని 30 మంది భక్తులు గుండాలకోన శివాలయంలో జాగరణ చేసేందుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా ఏనుగులు మంద వారిపైకి దూసుకొచ్చాయి. ఈ ఏనుగుల గుంపు ఐదుగురిని తొక్కి చంపాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి […]
AP Assembly Budget Session 2025 day 2: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఆందోళనకు దిగడంతో పాటు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి […]
GV Reddy Resign AP Fibernet Chairman: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పదవితో బాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర విమర్శలు.. ఫైబర్ నెట్లో వైసీపీ అక్రమంగా నియమించినఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై మూడు రోజుల క్రితం కీలక అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. […]
APPSC Group 2 Mains Key 2025: గ్రూప్-2 పరీక్షలు సజావుగా ముగిశాయని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. వారిలో 92శాతం మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం సూచించినా యథావిధిగా.. గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష […]
Deputy CM Pawan Kalyan Meeting With Jana Sena MLAs and MPs: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగింది. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను జనసేన ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ […]
APPSC Group 2 Mains Exams Started: ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ తొలి పేపర్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ జరగనుంది. అయితే పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. […]