Home / ap news
Ration Card E-KYC Update Deadline Extended To April 30: రేషన్కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎవరైనా ఇప్పటివరకు ఈకేవైసీని పూర్తి చేసుకోని వారు ఉంటే ఏప్రిల్ 30 లోగా చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, ఈకేవైసీ ప్రక్రియ తో రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తారు. ఆ […]
AP Govt Announces Chairmen for 47 Market Committees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తాజాగా, ఏపీ సర్కార్ ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు […]
AP CM Chandrababu Naidu speaks at IIT Madras: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, అందులోనూ తెలుగువారు ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 ప్రోగ్రాంకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, భవిష్యత్ అంతా భారతీయులదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో తెలుగు విద్యార్థులు రాణించాలన్నదే తన స్వార్థమన్నారు. ఇందు కోసం అమరావతిలో […]
Pastor Ajay on Pastor Praveen Pagadala Death: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయని ఆయనది మరణం కాదు హత్య అంటూ ఆయన అనుచరులు, క్రైస్తవ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.. […]
Free Gas Cylinder Deepam 2 Scheme Apllying Last Date March 31: బిగ్ అలర్ట్. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్కు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ‘దీపం 2.0’ పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే గడువు ఉందని తెలిపారు. ఈ పథకంతో ఇప్పటివరకు 98 లక్షల మందికిపైగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం […]
YSRCP Leader Kodali Nani Joined In Aig Hospital: మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తొలుత గుడివాడ మాజీ ఎమ్మెల్యేకు గుండెపోటు వచ్చిందని అతని సన్నిహిత వర్గాల నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం వచ్చింది. తొలుత కొడాలి నానికి ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని, దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి […]
CM Chandrababu Announcement for Talliki Vandanam Scheme implemented by May: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే నెలలో తల్లికి వందన పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. అందరి ఖాతాల్లో రూ.15వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తామని చెప్పారు. అయితే స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ను […]
CM Chandrababu About DSC notification Announcement: సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో కలెక్టరతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే సరికి పోస్టింగ్స్ పూర్తి కావాలని చెప్పారు. అలాగే రెవెన్యూ భూ సమస్యలపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఈ మేరకు భవిష్యత్ లక్ష్యాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్కూళ్లు ప్రారంభ సమయానికే […]
TDP Focus On Kurnool Mayor Seat: కర్నూలు నగర మేయర్ని పదవి నుంచి తప్పించడానికి సొంత పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన నేతలు ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికలను ఏకపక్షం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలా ఎన్నికైన మేయర్ తన పదవిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించారని టీడీపీ నాయకులు ఆరోపణలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారాక వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరుతున్నారు.. దాంతో […]
ACB Case Filed Against YCP Former Minister Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్పై విజిలెన్స్ తనిఖీలంటూ దాదాపు రూ.2కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసినట్లు అభియోగంపై విడుదల రజినిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొంతమందిపై ఏసీబీ కేసు నమోదు […]