Home / ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలోని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద అర్థరాత్రి 11 గంటల తరువాత తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. భారీగా పోలీసులు వారింటివద్ద మోహరించారు. బండారు సత్యనారాయణ మూర్తికి 41 ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 60 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలో 40 చోట్ల, తెలంగాణాలో 20 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారన్న సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర నాలుగో దశలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలోపర్యటించనున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నంలో ముందుగా మహాత్మా గాంధీకి పవన్ నివాళులర్పిస్తున్నారు. ఆ తర్వాత వారాహి యాత్రలో భాగంగా.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత వచ్చేది జనసేన - తెలుగుదేశం ప్రభుత్వమేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి నాల్గవ విడత యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన సమన్వయకర్తలను కూడా నియమించింది.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా టీడీపీ అధిష్టానం ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ "మోత మోగిద్దాం" అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు నంద్యాల లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదవ్వగా.. ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రవిబాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. జీవితంలో ఏది శాశ్వతం కాదండి.. సినిమా వాళ్ల గ్లామర్ గానీ, రాజకీయ నాయకుల పవర్గానీ, అస్సలు శాశ్వతం కాదు.
జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది.