Kadiri Municipality: కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. చైర్ పర్సన్గా దిల్షా దున్నిషా..!

Kadiri Municipality Won by TDP, chair person Dilsha Dunnisa: సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్గా దిల్షా దున్నిషా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారిలు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కాగా, ఈ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఇదిలా ఉండగా, కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. అయితే వాటిలో టీడీపీకి 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
కదిరి మున్సిపాలిటీ టీడీపీ దక్కడంతో కార్యాలయం ముందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణా సంచా పేల్చారు. అనంతరం సంబరాల్లో మునిగితేలారు. కాగా,. ఈ ఎన్నికను ఏకగీవ్రంగా చేసేందుకు ఎమ్మెల్యే కందికొండ ప్రయత్నాలు ఫలించాయి.
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని బెంగళూరు టీడీపీ కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా.. ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక జరగగా.. వైస్ చైర్మన్లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. మరో వైపు, రాష్ట్రంలోని విశాఖ నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికతో పాటు మేజర్ పంచాయతీ చైర్మన్ పోస్టుకు ఎన్నిక జరగనుంది.