Published On:

YS Jagan Mass Warning: పేర్లు రాసిపెట్టుకోండి.. అన్యాయం చేసినవారికి సినిమా చూపిస్తాం: జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan Mass Warning: పేర్లు రాసిపెట్టుకోండి.. అన్యాయం చేసినవారికి సినిమా చూపిస్తాం: జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan Mass Warning: ప్రస్తుతం టీడీపీ టైమ్ నడుస్తోందని, కొడితే తీసుకుంటామని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ కార్యకర్తలు, నేతలకు అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం మాట్లాడారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, రెడ్ బుక్ అనే కాదు.. ఏ బుల్‌లోనైనా రాసుకోండి అని సవాల్ విసిరారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు రిటైర్ అయినా, విదేశాలకు పారిపోయినా లాక్కొచ్చి మరీ సినిమా చూపిస్తామని కార్యకర్తలకు జగన్ భరోసానిచ్చారు.

 

రాష్ట్రంలో రాక్షస పాలన..

కూటమి సర్కారు, అధికారులు, పోలీసులకు జగన్ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కానీ, కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదన్నారు. కేసులు, జైళ్లకూ భయపడకూడదని చెప్పారు. అలా అయితేనే రాజకీయాలు చేయగలమని స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలానే ఉన్నాయని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నాడని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

 

రాబోయేది వైసీపీ ప్రభుత్వమే..

తిరువూరులో సంఖ్యాబలం లేనిచోట టీడీపీ పోటీకి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మెజార్టీ వైసీపీ ఉంటే కూడా ఎన్నికను ఆపుతున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలు, నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను విడిచిపెడుతున్నారని దుయ్యబట్టారు. కానీ, రేపు కచ్చితంగా వైసీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ అని పేర్కొన్నారు. చంద్రబాబు నాటిని విత్తనాలు కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయని, మహిళలు అని కూడా చూడకుండా నెలల తరబడి జైళ్లలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిల్‌ రాగానే మరో కేసు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేసులు మీద కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారని మండిపడ్డారు. దళితుడు నందిగం సురేశ్ విషయంలోనే ఇలానే చేశారని మండిపడ్డారు. సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉన్నారని, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారని మండిపడ్డారు.

 

ఇవి కూడా చదవండి: