Published On:

YS Sharmila: 2వేల మందికి మద్దతు.. వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష

YS Sharmila: 2వేల మందికి మద్దతు.. వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష

APCC chief YS Sharmila started indefinite hunger strike in support Visakhapatnam Steel Plant workers: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోనున్నారు. మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా ఆందోళన బాట పట్టిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ప్రకటించింది. కాగా, తొలగించిన 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేసింది.

 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతో పాటు తొలగించిన 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వెల్లడించారు.