AP Government: మహిళా ఉద్యోగులకు తీపికబురు.. ప్రసూతి సెలవులు పెంపు

Meternity Leaves: ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 120 రోజులు ప్రసూతి సెలవులు ఇస్తుండగా.. తాజాగా వాటిని 180 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల తరహాలోనే ఏపీలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయనున్నారు.
సెలవుల పెంపుతోపాటు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు వర్తింపచేస్తున్నారు. ఇక నుంచి ఎంతమంది పిల్లలు పుట్టినా సెలవులు అమలులో ఉంటాయి. అయితే ప్రసూతి సెలవులను పెంచాలని ఎప్పటి నుంచో మహిళా ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రసూతి సెలవులను 180 రోజులకు పెంచుతామని నేతలు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే నేడు ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. ఈ నిర్ణయంపై ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.