Last Updated:

Current Bill : ఏపీలో మరోసారి కరెంట్ బాదుడు.. పూరి గుడిసెకు రూ.3,31,951 ల కరెంట్ బిల్లు..

ఏపీలో తాజాగా మరోమారు కరెంటు బిల్లు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్న పూరిగుడిసెకి.. విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో

Current Bill : ఏపీలో మరోసారి కరెంట్ బాదుడు.. పూరి గుడిసెకు రూ.3,31,951 ల కరెంట్ బిల్లు..

Current Bill : ఏపీలో తాజాగా మరోమారు కరెంటు బిల్లు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్న పూరిగుడిసెకి.. విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులను ఆశ్రయించాడు. ఈ షాకింగ్ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఆంధ్రప్రదేశ్ లోని ఎస్ రాయవరం మండలంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఎస్‌ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలో ఓ పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే ఆ వ్యక్తికి.. విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.3,31,951 లు రావడంతో రాజుబాబు కుటుంబం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు రావడమేంటని అధికారులను ఆశ్రయించారు.

అయితే ఈ విషయంపై విచారణ జరిపిన అధికారులు.. బిల్లును పరిశీలించి సాంకేతిక తప్పిదం వల్ల ఈ పొరపాటు చోటుచేసుకుందని తేల్చారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్‌ బిల్లు రూ.155 వచ్చిందని రాజుబాబు కుటుంబానికి తెలిపారు. కాగా, ఎస్సీ రాయితీ ఉండడంతో రాజుబాబు బిల్లు చెల్లించాల్సిన అవసరంలేదని అధికారులు వివరించారు. దాంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.