Nara Lokesh: చంద్రబాబు పేరే ఓ బ్రాండ్.. అందుకే పెట్టుబడులు వస్తున్నాయని నారా లోకేశ్ వెల్లడి

Minister Nara Lokesh Speech About AP Development: సీఎం చంద్రబాబు బ్రాండ్తోనే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని గుత్తి మండంలో బేతపల్లిలో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు.
ఇందులో భాగంగానే, 2,300 ఎకరాల్లో రూ.22వేల కోట్లతో రెన్యూ సంస్థ పవన, సౌర, బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేపట్టిందన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ఎంత మార్పు తీసుకొచ్చిందో.. రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ కూడా అంతే మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, 1500 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి హామి ఇచ్చారు. అలాగే కర్నూల్ జిల్లాలో హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని రాయలసీమకు తీసుకొస్తామని వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తమ బ్రాండ్లు కాదని, ఏపీకి చంద్రబాబు పెద్ద బ్రాండ్ అని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు తలచుకుంటే అభివృద్ధి పనులు ఇంకా వేగంగా చేస్తామన్నారు. ఆయన టార్గెట్ ప్రకారం.. దావోస్లో గ్రీన్ ఎనర్జీకి సైతం ఒప్పందం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అందరికీ విద్యుత్ బిల్లులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే క్యాపిటల్, డెవలప్ మెంట్ వికేంద్రీకరణ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఒక్క మెగా వాట్ కూడా తీసుకురాలేకపోయారని విమర్శలు చేశారు. కానీ గత ప్రభుత్వం రోడ్లపై ఏర్పడిన గుంతలను కూడా పూడ్చలేకపోయిందని చెప్పారు. అయితే ఏపీకి ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయని, టాటా, టీసీఎస్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వివరించారు.
వచ్చే నెలలో డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని నారా లోకేశ్ చెప్పారు. అంతేకాకుండా రాయలసీమలోని బేతపల్లిలో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ ద్వారా మరో 10వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు.