India Vs Srilanka: విమెన్ క్రికెట్ ట్రై సిరీస్.. ఇండియాను ఓడించిన శ్రీలంక

Cricket: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా విమెన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక 49.1 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది.
బ్యాటింగ్ ప్రారంభంలోనే శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. 31 పరుగులు వద్ద ఆ జట్టు తొలివికెట్ కోల్పోయింది. అనంతరం 151 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పర్వాలేదనిపించింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నీలాక్షి డిసిల్వా (56), హర్షిత్ సమర విక్రమ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో సంజీవని, కుమారి జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణాకు 3 వికెట్లు దక్కాయి.