Last Updated:

Pawan Meet Modi: మోదీతో జనసేనాని భేటీ.. అసలు అజెండా అదేనా..?

నేడు ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గవర్నర్ - సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా భేటీ కానున్నారు.

Pawan Meet Modi: మోదీతో జనసేనాని భేటీ.. అసలు అజెండా అదేనా..?

Pawan Meet Modi: నేడు ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గవర్నర్ – సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా భేటీ కానున్నారు.

శుక్రవారం సాయంత్రం నుంచి విశాఖపట్నంలో అందుబాటులో ఉండాలని పవన్ కు బీజేపీ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్‌ చోళాలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పవన్‌ను విందు భేటీలో కలుస్తారని సమాచారం. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే శనివారం ఉదయం అల్పాహార సమయంలో కలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వైసీపీ అరాచక పాలనను జనసేనాని ప్రధానికి వివరించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానిని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో జనసేనాని హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకోనున్నారు. ఆదివారం వరకూ విశాఖ నగరంలోనే ఆయన బస చేయనున్నారు. కాగా ఈ భేటీపై ఇప్పటి వరకు జనసేన స్పందించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే తెదేపాతో జనసేన పొత్తు పెట్టుకుంటుందన్న వార్తల నేపథ్యంలో టీడీపీతో కాకుండా బీజేపీతోనే పవన్ కలిసేందుకు ఇప్పటికే ఆయనను ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం. కాగా 2014 ఎన్నికల తర్వాత మోదీ, పవన్‌ కలవడం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: రేపు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

ఇవి కూడా చదవండి: