Last Updated:

Border Dispute : కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. కొల్హాపూర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ 37 విధింపు

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం దృష్ట్యా కొల్హాపూర్ జిల్లాలో మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 37 విధించారు

Border Dispute : కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. కొల్హాపూర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ 37 విధింపు

Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం దృష్ట్యా కొల్హాపూర్ జిల్లాలో మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 37 విధించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల తర్వాత, ఒకే చోట 5 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించబడింది. ఈ నిషేధం డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు కొనసాగుతుంది. శనివారం, కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగామహావికాస్ అఘాడి అధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రదర్శనకు అధికారులు, పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.

మరోవైపు మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై సుప్రియా సూలే నేతృత్వంలోని ఎన్‌సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరియు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపిల బృందం శుక్రవారం పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసింది. ఈ విషయమై శివసేన ఉద్ధవ్ వర్గం అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని.. మహారాష్ట్ర ప్రయోజనాలను పరిష్కరిస్తామని తెలిపారని అన్నారు.

కర్ణాటక, మహారాష్ట్ర  రెండు రాష్ట్రాలు పరస్పరం తమ భూభాగాలపై నియంత్రణను కోరుతున్నాయి. ఇది చాలా పాత వివాదం అయినప్పటికీ, ఇటీవలి కాలంలో దీనికి సంబంధించి మరలా ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇవి కూడా చదవండి: