Last Updated:

Pakistan Elections: పాకిస్తాన్ లో ఎన్నికలు నిర్వహించడానికి నిధులు లేవు..రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్

పాకిస్తాన్ లో ఎన్నికల నిర్వహణ కోసం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద నిధులు లేవని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ఆసిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Pakistan Elections: పాకిస్తాన్ లో ఎన్నికలు నిర్వహించడానికి  నిధులు లేవు..రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్

Pakistan Elections: పాకిస్తాన్ లో ఎన్నికల నిర్వహణ కోసం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద నిధులు లేవని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ఆసిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇమ్రాన్ ఖాన్ సంక్షోభాలను సృష్టిస్తున్నారు..(Pakistan Elections)

ఇమ్రాన్ ఖాన్‌ పై హత్యాయత్నం ఆరోపణ అబద్ధమని ఖవాజా ఆసిఫ్ అన్నారు.అతను మొదట మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ రిటైర్డ్ ఖమర్ జావైద్ బజ్వా పదవీకాలాన్ని పొడిగించాడు ఇప్పుడు అతను అతనిని నిందించాడు. మొదట, తన తొలగింపుకు అమెరికాను నిందించాడని తెలిపారు.ఇమ్రాన్ ఖాన్ ప్రావిన్స్ అసెంబ్లీలను రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేశారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఆయనను తన సీటు నుంచి తొలగించారని, ఇప్పుడు తాను కోర్టుల ముందు హాజరు కావాలనుకోవడం లేదని ఆసిఫ్ అన్నారు.ఇమ్రాన్ ఖాన్ ప్రతిరోజూ సంక్షోభాలను సృష్టిస్తున్నారని, అయితే ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తోందని, పాకిస్తాన్ త్వరలోనే ఈ సంక్షోభాల నుండి బయటపడుతుందని మిస్టర్ ఆసిఫ్ తెలిపారు.

మరోవైపు సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయడం వల్ల జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై దృష్టి సారించాలని ఇమ్రాన్ ఖాన్ న్యాయమూర్తులను కోరారు. పిటిఐ మద్దతుదారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్ చట్టం యొక్క పాలన దేశం యొక్క ప్రాథమిక హక్కు అని అన్నారు. ప్రభుత్వ ఎత్తుగడలను న్యాయమూర్తులు గమనించాలని కోరారు.పాలక మాఫియా” రాజ్యాంగంపై దాడి చేసిందని పిటిఐ చీఫ్ అన్నారు. అక్టోబర్ 8న జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎవరు హామీ ఇస్తారని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.

రంగంలోకి దిగనున్న సైన్యం..

విఫలమైన ఆర్థిక వ్యవస్థ మరియు అస్థిర రాజకీయ సంక్షోభం తీవ్రమైన పరిస్థితులను కలిగిస్తున్నాయి. పాకిస్థాన్ మిలటరీ పాలనా యంత్రాంగంలో జోక్యానికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మరియు భద్రతా దళాల మధ్య పెరుగుతున్న వైరం నేపధ్యంలో సైనిక పరిష్కారానికి రంగం సిద్దమయిందని పరిశీలకులు భావిస్తున్నారు.పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (PIPS), ఇస్లామాబాద్‌కు చెందిన పరిశోధనా సంస్థ ప్రకారం, 2021తో పోలిస్తే 2022లో దేశంలో ఇప్పటికే 27% ఉగ్రవాద దాడులు పెరిగాయి.పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాలలో, సైన్యం మూడుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది మరియు నాలుగు దశాబ్దాలు నేరుగా దేశాన్ని పాలించింది.