Bangladesh: భారత్ పై దాడి చేసేందుకు బంగ్లాదేశ్ రెడీ!

Bangladesh: పాకిస్థాన్ పై భారత్ దాడి చేస్తే, బంగ్లాదేశ్ భారత్ పై దాడి చేయాలన్నారు ఆదేశ మాజీ సైనిక అధికారి, ప్రభుత్వ సలహదారు రెహమాన్. ఇందుకుగాను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్థాన్ పై దాడి చేసిన మరుక్షణం బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలని సూచించాడు. అందుకు చైనాతో కలిసి ఉమ్మడి సైనిక చర్యకు సిద్ధమవ్వాలన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాలో బెంగాళీలో పోస్ట్ చేశాడు. ఈయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ కు అత్యంత సన్నిహితుడు.
“భారతదేశం పాకిస్థాన్ పై దాడి చేస్తే బంగ్లాదేశ్ భారత్ లోని 7 ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలి. ఇందుకు ఉమ్మడి సైనిక ఏర్పాటుకోసం చైనాతో సంప్రదింపులు జరపాలి”అని రాసుకొచ్చాడు రెహమాన్. ఈయన మాటలను ఆదేశ ప్రభుత్వం ఖండించింది. రెహమాన్ మాటలు ఆయన వ్యక్తిగతమని వాటికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదని ఆదేశ విదేశాంగశాఖ ప్రకటించింది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటులో జరిగిన హత్యలను దర్యాప్తు చేయడానికి స్వతంత్ర కమిషన్ ఛైర్మన్ గా రెహమాన్ నియమితుడయ్యాడు.
రెహమాన్ మాటలు ఆయన వ్యక్తిగతమని ప్రభుత్వ అధికారులెవ్వరూ సపోర్ట్ చేయవద్దని బంగ్లా ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ సార్వభౌమత్వం, సమగ్రత, పరస్పర గౌరవం, అన్ని దేశాలతో శాంతియుత సహజీవనం అనే సూత్రాలకు దృఢంగా కట్టుబడి ఉందని తెలిపింది.
మార్చి ప్రారంభంలో యూనస్ చైనాలో పర్యటించాడు. అక్కడ జరిగిన వ్యాపార సదస్సులో మాట్లాడిన ఆయన, హిందూ మహాసముద్రానికి బంగ్లా దేశ్ ఏకైక లీడర్ అని అన్నారు. చైనా ఎలాంటి ఎగుమతినైనా బంగ్లాదేశ్ పై జరిగేందుకు తాము సమ్మతిస్తామన్నారు. బంగ్లా దాదాపు 1,600 కి.మీ సరిహద్దును భారతదేశంతో పంచుకుందని అన్నారు. అందులో ఏడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని వాటికి సముద్రం చేరుకోవడానికి బంగ్లాదేశ్ తప్ప వేరే మార్గం లేదని వ్యాఖ్యానించారు. రెహమాన్ వ్యాఖ్యలపై భారత్ అసహనం వ్యక్తం చేసింది.
ఇప్పటికీ రెహమాన్ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. అసలు బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత్ సహకారంతోనని మరిచిపోతున్నారు. అలాంటిది పాక్ పై భారత్ దాడి చేస్తే ఈయనగారు భారత్ పై దాడికి వస్తారట. రెహమాన్ చేసిన వ్యాఖ్యలను ఆదేశ విదేశాంగశాఖ ఖండించింది.
యూనస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బంగ్లాదేశ్ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికే భారత్ కర్రుకాల్చి వాత పెట్టింది. నేపాల్, భూటాన్ మినహా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసేందుకు మంజూరు చేసిన ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని భారత్ ఉపసంహరించుకుంది.
పశ్చిమాసియా, యూరప్ తో పాటు అనేక దేశాలకు ఎగుమతుల కోసం బంగ్లాదేశ్ భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలను ఉపయోగించుకుంటోంది. అలాంటిది ఎలాంటి కారణాలు లేకుండా భారత్ పై యుద్ధం చేస్తాననడం హాస్యాస్పదం. అదికూడా ఉగ్రవాదాన్నిపెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ ను భారత్ కట్టడిచేసే ప్రక్రియలో బంగ్లాదేశ్ అకారణంగా దూరడం భారత్ కు చికాకు తెప్పించింది. బంగ్లా విదేశాంగ శాఖ మాత్రం రెహమాన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వాటికి బంగ్లాదేశ్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది.