Published On:

GOA: జాతరలో తొక్కిసలాట, ఏడుగురు మృతి

GOA: జాతరలో తొక్కిసలాట, ఏడుగురు మృతి

GOA: గోవా షిర్గావ్‌లోని శ్రీ లైరాయ్ జాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగింది. (stampede at goa temple lairai devi jatra)  శుక్రవారం రాత్రి  జరిగిన ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గోవా మెడికల్ కాలేజీ (జిఎంసి), మాపుసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. షిర్గావ్‌లో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు  జాతర జరుగుతుంది

 

క్షతగాత్రులను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించారు. ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. తొక్కిసలాటకుగల కారణాన్ని ఇంకా వెళ్లడించలేదు. పార్వతీదేవి స్వరూపంగా లైరాయ్ అమ్మవారిని కొలుస్తారు. గోవాలో అత్యంత వైభవంగా ఈ జాతరను జరుపుకుంటారు. శుక్రవారం షిర్గావ్‌లోని శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో జాతర ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

 

ఈ జాతరను అక్కడి సాంప్రదాయపద్దతిలో జరుపుకుంటారు. డోలు వాయిద్యం నడుమ, అమ్మవారిని కొలుస్తూ నైవేద్యాలను సమర్పిస్తారు. చెప్పులు లేకుండా నిప్పుల మీద నడుస్తారు. శిర్గావ్‌లో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు వైభవంగా జాతర జరుగుతుంది.

 

ఎప్పటిలాగే ఈసారి శుక్రవారం వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. జాతర జరుగుతుండగా అనుకోకుండ తొక్కిసలాట జరిగింది. దీంతో 7మంది మృతిచెందగా 38మంది గాయపడ్డారు. ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు గాయపడిన వారిని హాస్పిటల్ కు చేర్చారు. భక్తులను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో తిక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి: