Anchor Rashmi Hospitalised: రక్తస్రావం, నొప్పితో ఆస్పత్రిలో చేరిన యాంకర్ రష్మీ – ఇప్పుడెలా ఉందటే!

Anchor Rashmi Undergo Surgery: యాంకర్ రష్మీ ఆస్పత్రి పాలైంది. అధిక రక్తస్రావం, భుజం నొప్పితో కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆమెకు రెండు రోజుల క్రితం శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం పైగా బుల్లితెరపై యాంకర్గా రాణిస్తుంది. జబర్థస్త్, ఢీతో పాటు ఎన్నో టీవీ షోలకు యాంకర్గా వ్యవహరించింది.
బుల్లితెరపై ఫుల్ క్రేజ్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంది. జబర్థస్త్ ఆ తర్వాత ఢీ షోతో వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ పెరిగింది. అప్పటి నుంచి ఈ క్రేజ్ను ప్రతి ఈవెంట్లోను వాడేసుకున్నారు. అలా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడా? అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. వీరి నుంచి ఎలాంటి గుడ్న్యూస్ రావడం లేదు. ఇకపోతే ప్రస్తుతం రష్మీ జబర్థస్త్ షోకు యాంకర్గా కొనసాగుతోంది. కానీ, సుధీర్ మాత్రం దీని నుంచి బయటకు వచ్చాడు. దీనితో పాటు పలు స్పెషల్లో షోలోనూ మెరుస్తోంది.
రక్తస్రావం, భుజం నొప్పి
ఈ మధ్య రష్మీ బుల్లితెరపై చాలా తక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె సందడి పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలో కొంత గ్యాప్ తర్వాత రష్మీ తన ఇన్స్టాగ్రామ్లో ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు షేర్ చేస్తూ అందరికి షాకిచ్చింది. దీనికి ఆమె ఇలా రాసుకొచ్చింది. “కొన్ని నెలలుగా నాకు తరచూ రక్తస్రావం అవుతుంది. దీనికి తోడు తీవ్రమైన భుజం నొప్పి. కొన్ని రోజులుగా ఈ నొప్పితో విలవిల్లాడు. కానీ, ముందు దేనికి చికిత్స తీసుకోవాలో అర్థం కాలేదు. ఇలా చూస్తుండగానే శరీరంలో రక్తం కూడా తగ్గిపోయింది. ఐదు రోజుల్లో హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది.
మర్చిలో క్షీణించిన ఆరోగ్యం
ఇక మార్చి 29 నుంచి నా శరీరం నా కంట్రోల్లో లేకుండపోయింది. చాలా నీరసించి పోయాను. అయినా ఎలాగోలా నేను కమిటైన నా ప్రాజెక్ట్స్ పూర్తి చేసి నా ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. ఆస్పత్రిలో చేరాను. ఏప్రిల్ 18న నాకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నాను. ఈ కష్ట సమయంలో నాకు అండగా ఉండి నాలో ధైర్యం నింపిన డాక్టర్లు, నా స్నేహితులు, వెల్ విషెర్స్, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మూడువారాల విశ్రాంతి అనంతరం తిరిగి సెట్లో అడుపెడతాను. ఈ రెండు ఫోటోల్లో మొదటిది నేను ఆపరేషన్ థియేటర్లకు వెళ్లడానికి ముందు, ఆపరేషన్ పూర్తయిన తర్వాత దిగిన ఫొటో అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్ ఫ్యాన్స్ అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.