Published On:

AP Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

AP Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

AP Mega DSC Exams Schedule Released: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది.

 

కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ పోస్టులకు మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోగా.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్స్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.

 

ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్స్(ఎస్‌ఏ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ), ప్రిన్సిపల్స్ పోస్టులు ఉన్నాయి. పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతుండగా.. రోజుకు 40వేల మంది పరీక్ష రాసేవిధంగా అధికారులు ప్లాన్ చేశారు. ఇలా ప్రతి సెషన్‌కు 20 వేల మంది పరీక్ష రాసే విధంగా ఎగ్జామ్స్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు.

 

ఇదిలా ఉండగా, మెగా డీఎస్సీకిి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను సైతం విడుదల చేసింది. కాగా, ఇటీవల మొత్తం 17 పేపర్లకు సంబంధించి మాక్ టెస్ట్‌ను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.