Home /Author M Rama Swamy
London Airport : ఓ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో లండన్లోని హీత్రో విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు మెరుగుపడటంతో ఫైట్ సర్వీసులను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా హీత్రో విమానాశ్రయానికి రాకపోకలను పునఃప్రారంభించినట్లు ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు వర్జిన్ అట్లాంటిక్, బ్రిటిష్ ఎయిర్వేస్లు కూడా షెడ్యూల్ ప్రకారం సర్వీసులు నడిపించినట్లు తెలిపాయి. ఎయిరిండియా విమానం ఏఐ111తోపాటు లండన్కు రాకపోకలు సాగించే అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు ఫ్రాంక్ఫర్ట్కు […]
AP New DGP : ఏపీ ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్రెడ్డి, హరీశ్కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను కేంద్రానికి పంపించింది. ఇందులో మూడు పేర్లు ఎంపిక చేసి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్చార్జి డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు […]
Rain : వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఉరుములు మెరుపులతో మొదలైన వాన దాదాపు గంట సేపు కురిసింది. దీంతో జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. జహీరాబాద్తోపాటు మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో మోస్తరు […]
Chandrababu : ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర పథకాలు, ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారీ స్కోర్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు జోష్ హేజిల్వుడ్ పెద్ద షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) వికెట్ సాధించాడు. ఐపీఎల్ ఆరంభ వేడుకలు.. షారుక్ ఖాన్తో […]
Jnanpith Award : హిందీ భాషలో అనేక రచనలు చేసిన ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు దేశంలోనే ఉన్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్పీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్గఢ్కు చెందిన 88 ఏళ్ల శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో షార్ట్ స్టోరీస్, కవితలు, వ్యాసాలు రాశారు. దేశంలోని ప్రముఖ హిందీ రచయితల్లో ఒకరైన శుక్లా సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఉన్నత పురస్కారం దక్కింది. శుక్లాను జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు […]
Gaddam Prasad Kumar : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించేదిగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నపై […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శనివారం ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒంటరిగానే గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని, అధికారం కోసం కొందరు కండువాలు మార్చడం పరిపాటిగా మారిందని పరోక్షంగా అన్నారు. సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు […]
Gold Cards : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు 44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజుల్లోనే 1,000 గోల్డ్ కార్డులు విక్రయం.. ఒక్కరోజుల్లోనే 1,000 గోల్డ్ కార్డులు […]
Telangana Assembly : అసెంబ్లీలో ఇవాళ మధ్యాహ్నం ఆసక్తికర చర్చ జరిగింది. రైతు సమస్యలు, రైతు రుణమాఫీ, వడ్ల బోనస్పై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు.. నియోజకవర్గంలో తాను తిరిగినట్లు తిరగలేవని చెప్పారు. ప్రజలకు ఎక్కువ కాలం ఎవరు అందుబాటులో ఉంటారో తేల్చుకుందామా? అని కౌంటర్ ఇచ్చారు. సన్నవడ్లకు […]