Home /Author M Rama Swamy
Srirama Navami 2925 : భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డిని మంత్రి కొండా సురేఖ, భద్రాచలం దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో స్వయంగా కలిసి రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా శ్రీరామనవని బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర […]
Pasala Krishna Bharathi : గాంధేయవాది పసల కృష్ణభారతి (92) ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి. జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నారు. గాంధీజీ ప్రవచించిన విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందజేశారు. దళితుల్లో విద్యావ్యాప్తికి ఆమె ఎనలేని కృషిచేశారు. గోశాలలకు విరాళాలు కూడా సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, […]
IPL 2025 : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, రాజస్థాన్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. సన్రైజర్స్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, […]
Kishan Reddy : ఇప్పటివరకు డీలిమిటేషన్పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. డీలిమిటేషన్పై సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేని అంశాన్ని భూతద్దంలో […]
SRH Vs RR : సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్ద హైదరాబాద్ క్రికెట్ సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు 2,700 […]
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. ఒకరిద్దరూ మినహా అందరూ రాణించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. మూడు సిక్సులు, 4 ఫోర్టు కొట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తర్వాత రఘువంశీ చివరి వరకూ పోరాడి 30 పరుగులు చేశాడు. మొత్తంగా కేకేఆర్ […]
London Airport : ఓ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో లండన్లోని హీత్రో విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు మెరుగుపడటంతో ఫైట్ సర్వీసులను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా హీత్రో విమానాశ్రయానికి రాకపోకలను పునఃప్రారంభించినట్లు ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు వర్జిన్ అట్లాంటిక్, బ్రిటిష్ ఎయిర్వేస్లు కూడా షెడ్యూల్ ప్రకారం సర్వీసులు నడిపించినట్లు తెలిపాయి. ఎయిరిండియా విమానం ఏఐ111తోపాటు లండన్కు రాకపోకలు సాగించే అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు ఫ్రాంక్ఫర్ట్కు […]
AP New DGP : ఏపీ ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్రెడ్డి, హరీశ్కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను కేంద్రానికి పంపించింది. ఇందులో మూడు పేర్లు ఎంపిక చేసి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్చార్జి డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు […]
Rain : వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఉరుములు మెరుపులతో మొదలైన వాన దాదాపు గంట సేపు కురిసింది. దీంతో జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. జహీరాబాద్తోపాటు మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో మోస్తరు […]
Chandrababu : ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర పథకాలు, ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు […]