Home /Author M Rama Swamy
Hyderabad : సోషల్ మీడియాలో సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి బెయిల్ లభించింది. రూ.25 వేల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, మంగళవారం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ‘నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్లో ముఖ్యమంత్రిని రేవంత్రెడ్డిని తిడుతున్న వీడియో వైరల్గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ […]
Chandrababu : 2047 ఏడాది నాటికి మన దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇవాళ శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ -2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. 2047 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అప్పటి వరకు 2.4 ట్రిలియన్ల ఆర్థిక […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న […]
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పించడంపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెంకన్న దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం, మంగళవారం, రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఒక్కో […]
Rajnath Singh : కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో అగ్రరాజ్యం అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు. సౌత్బ్లాక్లో ఈ మీటింగ్ జరిగింది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం కూడా చర్చల అజెండాలో ఉంది. ఓ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్లో రెండున్నర రోజుల పర్యటనకు తులసీ న్యూఢిల్లీకి వచ్చారు. గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్లో […]
USA, Road accident : అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారు. ఇండియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు అర్విన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ […]
Revanth Reddy : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సమస్యను పరిష్కరించేందుకే తెలంగాణలోని యూనివర్సిటీలు, సంస్థలకు రాష్ట్రానికి సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. ఇవాళ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు […]
Cabinet Meeting : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (సోమవారం) కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులుకు మంత్రివర్గం ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన 10 సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ […]
Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరుగగా, ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు కారు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ (56), భార్య వాణి(45) మృతిచెందారు. కుమారుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో […]
Karnataka : దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. దీంతో యువత డ్రగ్స్కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కొందరు డబ్బుల ఆశకు డ్రగ్స్ వ్యాపారానికి పాల్పపడుతున్నారు. దేశంలో ఎక్కడో ఓ చోట రోజు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా భారీగా డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ మేరకు డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు […]