Home / తాజా వార్తలు
ఆయనొక ప్రజా ప్రతినిధి.. మాజీ మంత్రి కూడా.. అయితే ఏం లాభం...సొంత భార్యను కొట్టి కొట్టి చంపాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన కజకిస్తాన్లో జరిగింది. గత ఏడాది నవంబర్లో తన భర్తకు చెందిన బంధువు రెస్టారెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేరు కుయాండిక్ బిషింబాయేవ్. కాగా ఆయన భార్య పేరు సాల్తానాట్ నుకెనోవా.
లోక్ సభ మూడవ విడత పోలింగ్కు గడువు దగ్గరపడుతోంది. ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రెవన్న, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రెవన్నలు మహిళలపై అత్యాచారాల కేసులు, సెక్స్ టేప్ల కేసులు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసింది. కాగా ప్రజ్వల్పై ఇప్పటి వరకు కర్ణాటకలోని పలు పోలీసు స్టేషన్లలో తమపై తుపాకి చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడని పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మాజీ డిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ ఝలక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పిన అర్విందర్సింగ్ లవ్లీ శనివారం నాడు బీజేపీ కండువ కప్పుకున్నాడు. ఇక అర్విందర్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీతో పొత్తు పెట్టుకోవడమే. ఆప్తో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ నెల ఎనిమిదో తేదీ లోపు రైతు భరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొమ్మిదో తేదికేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని.. బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
ఒడిషాలో కాంగ్రెస్కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. పూరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా మొహంతి పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం నిధులు ఇవ్వడానికి నిరాకరించడంతో తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు.
బ్రెజిల్లోని దక్షిణాది రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్లో భారీ వర్షాలకు 39 మంది మరణించగా 74 మంది గల్లంత యినట్లు స్థానిక అధికారులు తెలిపారు, మరికొన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలనుంచి సమాచారం రావలసి వున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రియో గ్రాండే డో సుల్ గవర్నర్ ఎడ్వర్డో లైట్ తెలిపారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఒకరి నొకరు కొట్టుకుంటే ... వారు విద్యార్థులను ఉత్తమ పురుషులుగా ఎలా తీర్చగలుగుతారు? వీరిని చూసి వారు కూడా రౌడీల్లా తయారవుతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు అసలు కథ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి ముగ్గురు యువకులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత ఇండియా, కెనడాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయి.
గుడివాడలో రోడ్లంతా గోతుల మయం.. స్థానిక ఎమ్మెల్యే నోరు బూతుల మయమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి భూములను లాక్కోవడానికి కొత్త పథకం వేసిందని విమర్శించారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ధ్వజమెత్తారు.