Home / తెలంగాణ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. చండూరు సభలో తనను అసభ్యకరంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఎంసెట్, ఈ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 80.41 ఉత్తీర్థన సాధించగా, అగ్రికల్చర్ స్ట్రీమ్లో 88.34 శాతం, ఈ సెట్లో 90.7 శాతం మంది ఉత్తీర్ణీలయ్యారు.
పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు.
నాగార్జున సాగర్కు వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు అన్నీ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 4 లక్షల 14 వేల 14 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4 లక్షల 22 వేల 292 క్యూసెక్కులుగా ఉంది.
రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్టర్లో తన చిన్న నాటి జ్జాపకాలను పంచుకున్నారు. కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ చెల్లెలు కవితతో ఉన్న ఫొటోతో పాటు కూతురు అలేఖ్య, హిమన్షు ల పిక్స్ షేర్ చేస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. తరుణ్ చుగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం సునీల్ బన్సాల్ను నియమించింది. ప్రస్తుతం సునీల్ బన్సాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.