Home / Telangana
Former Minister Harish Rao meets KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మరోసారి సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో ఇద్దరూ మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై చర్చించారు. బుధవారం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విచారణ అంశంపై సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. హరీశ్రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో […]
Engineering counseling : జులై మొదటివారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆగస్టు 14లోగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. అనుమతి లేకుండా కొందరు విద్యాసంస్థలు నడుపుతున్నారని పేర్కొన్నారు. అందులోనే విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్స్ఎల్ టెక్ ఎడ్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వివరణ కోసం ఈ నెల 13వ తేదీ వరకు విద్యాసంస్థలకు గడువు ఇచ్చామన్నారు. […]
Telangana CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో చర్చించారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. […]
Deputy CM Bhatti Vikramarka good news to Electricity Department Employees: విద్యుత్ శాఖ ఉద్యోగులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ప్రమాదబీమా అందించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ పథకం కింద విద్యుత్ శాఖలో ఉద్యోగులకు రూ. కోటి వరకు ప్రమాద […]
TPCC New Program in Gandhi Bhavan: టీపీసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హైదరాబాద్లో ఉన్న గాంధీభవన్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేలా ఈ కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి గాంధీభవన్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధుల […]
Telangana Schools Academic Calendar 2025-26 Released: తెలంగాణలో రెండు రోజుల్లో బడిమోత మోగనుంది. జూన్ 12 నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ విడుదల అయింది. ఇందులో 230 వర్కింగ్ డేస్ ఉంటాయని అన్ని జిల్లాల డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఎగ్జామ్స్, హాలీడే తేదీలను వెల్లడించింది. ఇక, జూన 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న తరగతులు […]
Bus Pass Prices: తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్ పాస్ రేట్లను పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. జనరల్ బస్ పాస్ ధరలతో పాటు, స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. దాదాపు 20 శాతానికిపైగా ఛార్జీలను పెంచేసింది. కాగా ఇప్పటివరకు రూ. 1150గా ఉన్న సిటీ ఆర్డీనరి పాస్ ధర తాజాగా రూ. 1400కి చేరింది. ఇక రూ. 1300 గా ఉన్న మెట్రో […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాళేళ్వరం కమిషన్ విచారణ ముగిసింది. బీఆర్కే భవన్ లో సుమారు 45 నిమిషాలపాటు ఆయనను కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి నీరుపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నందున నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలను హరీశ్ రావు నుంచి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం డిజైన్లు, బ్యారేజీల ఎంపికపై జస్టిస్ సీపీ ఘోష్ […]
Telangana: హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలు సహా.. తెలంగాణలో ఆషాడ బోనాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 26 నుంచి ఆషాడ బోనాల వేడుకలు షురూ కానున్నాయి. ఆషాడ మాసం నెలరోజులపాటు బోనాల పండుగ జరగనుంది. కాగా తొలుత గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లోని 28 ప్ముఖ ఆలాయాల్లో ఆషాడ బోనాల పండుగ జరగనుంది. దీంతో దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు, జాతరకు […]
Congress: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్నారు. అయితే తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చించేందుకేనని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకోసమే ఈరోజు ఉదయం 10.20 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. కొత్త మంత్రులకు ఎలాంటి శాఖలు అప్పగిస్తారనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్న శాఖల […]