Home / Telangana
Telangana Police issues strong warning to singer Mangli : చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో పోలీసులు దాడి చేశారు. రిసార్ట్లో ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత పెద్ద ఎత్తున డీజే శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రిసార్ట్లో మెరుపు దాడి చేశారు. పుట్టిన రోజు వేడుకల్లో విదేశీ మద్యం పట్టుబడింది. గంజాయి తాగుతూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. మంగ్లీ తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీంతో […]
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులపై శాఖల కేటాయింపుపై ఆయన స్పష్టత ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కొన్ని నెలల వరకు మంత్రి పదవులు ఇవ్వలేదని, ఇచ్చినప్పటికీ శాఖలను కేటాయించలేదని గుర్తుచేశారు. తాను మాత్రం రెండు మూడు రోజులకే శాఖలు కేటాయించినట్లు తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై కీలక […]
Former CM KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్కు కేసీఆర్ పలు డాక్లుమెంట్లను అందజేశారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ఎదుట కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్ నుంచి […]
Yadadri Bhuvangiri: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు యాదాద్రి భువనగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావు గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా చేనేత జౌలిశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి టూరిజం పార్క్ తో పాటు సమీపంలోని చేనేత కార్మికుల ఇళ్లను పరిశీలించారు. టెక్స్ టైల్ పార్క్ లో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే టెక్స్ […]
Gali Janardhan Reddy bail in OMC Case: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు సీబీఐ విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రూ.10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు పాస్ పోర్టు సరెండర్ […]
ACB Raids in Telangana: తెలంగాణలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, బెంగళూరులోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నూనె శ్రీధర్ పనిచేశారు. ఈ ప్రాజెక్టులో 6, 7 […]
Janagama MLA Palla Rajeswar Reddy Accident in KCR farm house: జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డాడు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా, పల్లా.. రాత్రి నుంచి కేసీఆర్ ఫాంహౌస్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారీపడ్డారు. […]
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏడుగురు స్నేహితులు నిన్న నాగార్జునసాగర్ చూసేందుకు కారులో వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా.. నాగార్జున సాగర్ హైవేపై మాల్ వద్ద వారి కారును బస్సు ఢీకొంది. దీంతో ఘటనా స్థలిలోనే ముగ్గురు యువకులు మృతి […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి నేడు విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ మేరకు ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. అయితే సీఎం కేసీఆర్ విచారణ ఎలా చేస్తారనేది స్పష్టత లేదు. కేవలం రహస్య విచారణ చేస్తారా? లేక బహిరంగ విచారణ […]
Telangana High Court : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మంగళవారం పిటిషన్లపై న్యాయస్థానం విచారణ ముగించింది. ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా గోపీనాథ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ నేత అజహరుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై ధర్మాసనంలో విచారణ జరుగుతుండగా, రెండు రోజుల కింద ఎమ్మెల్యే మాగంటి అనారోగ్యంతో మృతిచెందారు. విషయాన్ని న్యాయవాదులు హైకోర్టు […]