Home / Telangana
Kishan Reddy : ఇప్పటివరకు డీలిమిటేషన్పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. డీలిమిటేషన్పై సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేని అంశాన్ని భూతద్దంలో […]
SRH Vs RR : సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్ద హైదరాబాద్ క్రికెట్ సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు 2,700 […]
Supreme Court Once Again Notices to Telangana Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఆయనకు కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆయనకు తొలుత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు ఆయన స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు […]
Rain : వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఉరుములు మెరుపులతో మొదలైన వాన దాదాపు గంట సేపు కురిసింది. దీంతో జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. జహీరాబాద్తోపాటు మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో మోస్తరు […]
Gaddam Prasad Kumar : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించేదిగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నపై […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శనివారం ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒంటరిగానే గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని, అధికారం కోసం కొందరు కండువాలు మార్చడం పరిపాటిగా మారిందని పరోక్షంగా అన్నారు. సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు […]
Telangana Assembly : అసెంబ్లీలో ఇవాళ మధ్యాహ్నం ఆసక్తికర చర్చ జరిగింది. రైతు సమస్యలు, రైతు రుణమాఫీ, వడ్ల బోనస్పై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు.. నియోజకవర్గంలో తాను తిరిగినట్లు తిరగలేవని చెప్పారు. ప్రజలకు ఎక్కువ కాలం ఎవరు అందుబాటులో ఉంటారో తేల్చుకుందామా? అని కౌంటర్ ఇచ్చారు. సన్నవడ్లకు […]
KTR : డీలిమిటేషన్పై చర్చించేందుకు తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. చెన్నైలోని హోటల్ ఐటీసీ చోళలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన భేటీలో బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్తో ఎన్నో నష్టాలు ఉన్నాయని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం వివక్షతో ఇప్పటికే సౌత్ రాష్ట్రాలు వెనకబడ్డాయని, ఆర్థికంగా చితికిపోతున్నాయని కామెంట్ చేశారు. కేంద్రం దేశ సమాఖ్య స్ఫూర్తిని […]
Jobs Notifications in telangana revenue department: నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఈ నియామకాలు చేపట్టనున్నారు. కాగా, […]
Bandi Sanjay : గత పదేళ్లలో తెలంగాణలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పారు. ప్రస్తుతం వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో సమీక్షలు, సర్వేలు, నివేదికల పేరుతో కాలం గడిపారన్నారు. సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. డీలిమిటేషన్పై కలిసిన వారంతా దొంగల ముఠానే […]