Home / Telangana
Free Prasadam in Yadagirigutta Temple: భక్తుల సౌకర్యార్థం యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరి నర్సన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా పులిహోర, లడ్డూ పంపిణీ చేయాలని దేవస్థానం భావిస్తోంది. రేపటి నుంచి ఈనెల 30 వరకు ట్రయల్ రన్ నిర్వహించనుంది. అంతా సవ్యంగా జరిగితే.. జూలై 1 నుంచి వారంలో ఆరు రోజులు పులిహోర, శనివారం నాడు పులిహోరతో పాటు లడ్డూ ప్రసాదాన్ని సైతం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఈవో వెంకట్ […]
IAS Officers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను సర్కారు బదిలీ చేసింది. గురువారం సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 33 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన, రాష్ట్ర ఆయిల్ఫెడ్ ఎండీగా జె.శంకరయ్య, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయెల్, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా […]
Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం నుంచి రక్షణ కోసం పొలంలో ఉన్న కర్రలతో […]
Air india : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. దిగ్భ్రాంతికి గురిచేసింది : ఏపీ సీఎం చంద్రబాబు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి […]
Hall Tickets: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. టెట్ పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేది వివరాలు అఫిషియల్ వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి ఆన్ లైన్ లో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి 11.30 మొదటి సెషన్, మధ్యాహ్నం 2 […]
BRS Working President KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. ఫోరమ్ ఈ నెల 20,21 తేదీల్లో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనుంది. ‘భారత అభివృద్ధికి ఫ్రంటీయర్ టెక్నాలజీస్’ అనే అంశంపై ఈ సంవత్సరం ఫోరమ్ దృష్టిసారించింది. భారత్లో సాంకేతికత, ఇన్నోవేషన్, సస్టైనబిలటీని కలగలిపి ముందుకెళ్లే అంశాలపై చర్చ జరగనుంది. తన విలువైన అభిప్రాయాలను తెలియజేసేందుకు రావాలని కేటీఆర్కు […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మొన్నటి వరకు వర్షాల జాడలేక ఎండలు ఠారెత్తించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోయారు. తాజాగా వాతావరణం మారిపోయింది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. నైరుతి రుతుపవనాల కదలిక, అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు […]
Road Accident in Narayanapet: నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ మండలం బొందల్ కుంట- జక్లేర్ గ్రామల సమీపంలో 167వ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురిని రాయచూర్ కి, మిగిలిన వారిని మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి […]
Schools Re Open in Telangana: వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 61 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఇవాళ్టి నుంచి స్కూళ్లు ప్రారంభంకానుండటంతో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో సర్కార్లు, ప్రైవేట్ కలిపి మొత్తం 41,354 స్కూళ్లు ఉండగా, వాటిలో 61.99 లక్షల మంది […]
Telangana Ministers Portfolio: రాష్ట్ర కేబినెట్ లో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య అభివృద్ధి శాఖలతోపాటు క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను కేటాయించారు. ఇక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామికి ముఖ్యమైన గనులు, జియాలజీ, ఫ్యాక్టరీలు, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖలను కేటాయించారు. ఈ […]