Home / Telangana
KCR : బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్రెడ్డి సహా సభ్యులు సవాల్ విసిరారు. శాసన సభకు వచ్చి పతిపక్ష నేతగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని సభ్యులు మాట్లాడారు. అయినా కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటి వరకూ రాలేదు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి […]
MLC election : రాష్ట్రంలో మరో ఎన్నిక నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎలక్షన్ సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 1 మే 2025న పదవి పూర్తి కాబోతున్న ఎంఎస్ ప్రభాకర్రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిక జరగబోతున్నది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ 23న ఎన్నిక నిర్వహించనున్నారు. 25న ఫలితాలు లెక్కించనున్నట్లు ఈసీ పేర్కొంది. హైదరాబాద్ జిల్లాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు […]
TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 3వ తేదీ నుంచి 5వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తానా 24వ కాన్ఫరెన్స్కు రావాలని సీఎం రేవంత్రెడ్డిని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. ఇవాళ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో […]
BRS MLA’s Protest at Telangana Legislative Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పురపాలక సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పద్దులపై చర్చ జరిగింది. అదే విధంగా పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులపై సైతం చర్చ జరగనుంది. అయితే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ నినాదాలు చేశారు. కాగా, శాసనసభకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వచ్చారు. దీంతో సభకు రావొద్దని […]
KCR Comments on Chandrababu: కేసీఆర్ పాత నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మళ్లీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కేసీఆర్ అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కేసీఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో […]
A Man rape attempt to young women in Hyderabad MMTS Train: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ యువతి ఏకంగా నడుస్తున్న రైలులో నుంచి బయటకు దూకేసింది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారానికి యువకుడు యత్నించాడు. మహిళా కోచ్లో యువతితో పాటు ఇద్దరు మహిళలు […]
Road accident : ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని దంపతులు, 8 ఏళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, […]
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభలో ఇవాళ అపశ్రుతి చోటుచేసుకుంది. కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా కాన్వాయ్లో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమెకు కాలు విరిగింది. పార్టీ కార్యకర్తలు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. తెలంగాణ అన్నిరంగాల్లో వెనకబాటు.. సీఎం […]
Srirama Navami 2925 : భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డిని మంత్రి కొండా సురేఖ, భద్రాచలం దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో స్వయంగా కలిసి రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా శ్రీరామనవని బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర […]
Pasala Krishna Bharathi : గాంధేయవాది పసల కృష్ణభారతి (92) ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి. జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నారు. గాంధీజీ ప్రవచించిన విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందజేశారు. దళితుల్లో విద్యావ్యాప్తికి ఆమె ఎనలేని కృషిచేశారు. గోశాలలకు విరాళాలు కూడా సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, […]