Home / Telangana
Artist Chintalapalli Kotesh Painting on Ahmedabad Plane Crash: నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై స్పందించి ఒక ఉహాచిత్రాన్ని వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపిందన్నారు.. తాను వేసిన ఈ చిత్రంలో విమాన ప్రమాదంలో ఎగిసిన మంటల్లో భయందోళనతో అర్తనాదాలతో , గుర్తుపట్టలేని […]
Heavy Rains expected to Telangana for Coming 3 Days: దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమిటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో […]
CPI State Secretary and MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పనికిరాదని, ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. హనుమకొండ జిల్లా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని కోరారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నోరు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించారని, ఇప్పుడు తనకు […]
BRS Chief and former CM KCR Visited 2nd time to AIG Hospital: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్తో కేటీఆర్, హరీశ్రావు ఆసుప్రతికి వచ్చారు. కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీకి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. శుక్రవారం కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. […]
Man Died in Aleru MLA Beerla Ilaiah’s Home: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలోని పెంట హౌస్లో అద్దెకు ఉంటున్నాడు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండురోజులుగా మృతుడి సొంత గ్రామం సైదాపురంలోనే ఉన్న అతడు ఎమ్మెల్యే నివాసంలో ఉరేసుకొని […]
Balmuri Venkat Filed a case on BRS Working President KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. […]
Gaddar Film Awards 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నేడు(శనివారం) హైటెక్స్లో వైభవంగా జరగనుంది. కొన్నేళ్లుగా సర్కారు నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగలేదు. దీంతో కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 ఏడాదికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో […]
CM Revanth Reddy Review On Education Department : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని చెప్పారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 […]
ACB notices to BRS working president KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 16న ఉదయం 10:00 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విచారించారు. […]
Telangana Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం లభించింది. కాగా నిన్న కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 8.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 8.38, యాదాద్రి భువనగిరి 6.55, హైదరాబాద్ లోని ముషీరాబాద్ […]