TS EAPCET 2025 Results Out: బిగ్ అలర్ట్.. ఎప్సెట్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాలను చెక్ చేసుకోండిలా?

Telangana EAPCET 2025 Results Out: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేడు ఎప్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పొందేందుకు నిర్వహించిన ఎప్ సెట్ ఫలితాలను కాసేపట్లలో విడుదల అవుతున్నాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
అభ్యర్థులు ఫలితాల కోసం https://eapcet.tgche.ac.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఎప్సెట్ పరీక్షలు రాశారు.
మొత్తం రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సు కోసం 2,20, 327 మంది విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2,07,190 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మిగతా 12వేల మందికి పైగా అభ్యర్థులు గైర్హజరయ్యారు. ఇక అగ్రికల్చర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 86,762 మంది విద్యార్థుల్లో 81,198 మంది హాజరయ్యారు.
ఇదిలా ఉండగా, ఇవాళ విడుదలయ్యే ఎప్సెట్ ఫలితాల ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. ర్యాంకులను అనుసరించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు త్వరగలోనే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ విధానం తేదీని ప్రకటించి నిర్వహించనున్నారు. ఇక, ఈ పరీక్షలను హైదరాబాద్లో ఉన్న జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మరోవైపు, ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వీటికి ఇంకా ఏఐసీటీఈ నుంచి పర్మిషన్ లభించలేదు. ఒకవేళ అనుమతి లభిస్తే విద్యార్థులకు మరింత లబ్ధి చేకూరనుంది. అలాగే మరో 159 కళాశాలలకు అనుబంధ గుర్తింపు రాలేదు. ఇప్పటికీ కళాశాలల్లో మౌలిక వసతులు, టీచర్లు తదితర విషయాలపై పరిశీలనలు కొనసాగుతున్నాయి.
అంతేకాకుండా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశానికి 2025-26 ఏడాది విద్యా సంవత్సరానికి గానూ ఫీజును ఖరారు చేయలేదు. కాగా, చాలా కాలేజీలు ఇప్పటికే భారీగా ఫీజులు పెంచేశాయి. దీంతో టీఎఫ్ఆర్సీ ఫీజుల విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.