TG EAPCET Results Out Now: ఎప్సెట్ ఫలితాలు వచ్చేశాయ్.. చరిత్రలోనే తొలిసారి నేరుగా.. టాప్ ర్యాంకర్లు వీళ్లే!

Telangana EAPCET Results Out Now: తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కాగా, ఈ సారి విద్యార్థులు దరఖాస్తు సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు ఫలితాలను పంపించారు. మార్కులతో పాటు ర్యాంకులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించనున్నారు. విద్యార్థుల నంబర్కు పంపడం ఇదే తొలిసారి. సబ్జెక్ట్ల వారీగా తెలుసుకునేందుకు ఈ లింక్ https://eapcet.tgche.ac.in/ క్లిక్ చేయండి.
ఇంజినీరింగ్ విభాగంలో టాపర్గా ఏపీకి చెందిన భరత్ చంద్రకు అత్యధిక మార్కులతో టాప్ ర్యాంకు సొంతమవ్వగా.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో తెలంగాణలోని మేడ్చల్ ప్రాంతానికి చెందిన సాకేత్ టాపర్గా నిలిచాడు. అయితే ర్యాంకుల ఆధారంగా కాలేజీల్లో సీట్లను పొందే అవకాశం ఉంటుంది.
ఇంజనీరింగ్ విభాగంలో ఏపీకి చెందిన మన్యం జిల్లా భరత్ చంద్ర 150.058 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా.. రెండో ర్యాంకు రంగారెడ్డి జిల్లాకు చెందిన రామచరణ్ రెడ్డి, మూడో ర్యాంకు ఏపీకి చెందిన విజయవనగరం జిల్లా హేమ సాయి, నాలుగో ర్యాంకు హైదరాబాద్కు చెందిన లక్ష్మీ భార్గవ్, ఐదో ర్యాంకు రంగారెడ్డి జిల్లా మంత్రిరెడ్డి వెంకట గణేశ్లకు దక్కాయి.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 87.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 81వేల మంది పరీక్ష రాయగా.. 71వేలమంది అర్హత సాధించారు. ఇందులో తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కు చెందిన సాకేత్ రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా.. రెండో ర్యాంకు కరీంగనగర్ జిల్లా కుచెందిన సబ్బాణి లలిత్, మూడో ర్యాంకు వరంగల్ ప్రాంతానికి చెందిన చాడ అక్షిత్, నాలుగో ర్యాంకు వనపర్తి చెందిన సాయినాథ్, ఐదో ర్యాంకు రెండ్ల బ్రాహ్మణి సాధించారు.