Home / national
Salman Khurshid : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బాటలోనే ఆ పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై ఆయన కితాబిచ్చారు. ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో భాగంగా ఇండోనేసియాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్కు చాలాకాలం ఒక పెద్ద సమస్య ఉండేదని చెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా జమ్మూకశ్బీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో వేరే […]
West Bengal CM Mamata Banerjee : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, హింస పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని తృణమూల్ ప్రభుత్వం నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అలిపుర్దువార్లో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో మోదీ […]
BCCI : స్వదేశంలో టీమ్ఇండియా మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టుతో సెప్టెంబర్లో 3 వన్డేలు జరగనున్నాయి. షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన ప్రారంభమయ్యే సిరీస్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ ఏడాది చివర్లలో మహిళల వన్డే ప్రపంచ కప్ జరగనున్నది. దాని కోసమే రెండు జట్ల సన్నాహాల్లో భాగంగా సిరీస్ నిర్వహించనున్నారు. మ్యాచ్లన్నీ చెన్నైలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్ షెడ్యూలు.. మొదటి వన్డే […]
Another setback for the Maoist Party : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగూడ సమీపంలోని […]
Road Accident in Maharashtra : మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఘటన లాతూర్-సోలాపూర్ హైవేపై గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుల్జాపూర్-లాతూర్ మార్గంలోని ఆశివ్ ఫాటా సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. పూణె నుంచి లాతూర్కు టూరిస్ట్ బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో అదేమార్గంలో వెళ్తున్న బస్సును వెనుక […]
Government servant Arrested : భారత్లో విస్తరించిన పాక్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు. తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడి ఫోన్లో పాక్కు చెందిన పలు నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజస్థాన్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగళియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడు స్టేట్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. […]
Shashi Tharoor posts on ‘X’ saying it didn’t mention wars : బీజేపీకి అనుకూల మాట్లాడుతున్న ఎంపీ శశిథరూర్పై ఆ పార్టీ నాయకుడు ఉదిత్రాజ్ మండిపడ్డాడు. బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా థరూర్ను నియమించాలంటూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాజాగా శశిథరూర్ స్పందించారు. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాట్లాడినట్లు చెప్పారు. గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదంటూ ఆయన గురువారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. తన దగ్గర ఎక్కువ సమయం లేదని […]
Assam Government issued Arms Licenses to Local People: అస్సాం సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన జారీ చేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గౌహతిలోని లోక్ సేవా భవన్లో జరిగిన […]
Rishabh Pant’s Interesting Comments on England Test series: భారత జట్టు త్వరలో ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తాను కొన్నిరోజులు క్రికెట్ గురించి ఆలోచించడం మానేస్తానని రిషభ్ పంత్ అంటున్నాడు. చిన్న విరామం తర్వాత తిరిగి ఇంగ్లండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం సన్నద్ధమవుతానని వివరిస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో ఇటీవల టీంమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషభ్ పంత్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ […]
3 Indians missing in Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు మిస్సింగ్ అయ్యారు. విషయాన్ని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అదృశ్యమైన ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది. తప్పిపోయిన వారు పంజాబ్లోని సంగ్రూర్కు చెందిన హుషన్ప్రీత్సింగ్, ఎస్బీఎస్ నగర్కు చెందిన జస్పాల్సింగ్, హోషియాపూర్కు చెందిన అమృత్పాల్ సింగ్గా గుర్తించారు. ఈ నెల 1వ తేదీన టెహ్రాన్లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, ఎప్పటికప్పుడు […]