Home / national news
గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతలుగా డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ పేర్కొన్న మేర, డిసెంబర్ 1, 5 వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగనున్నది.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
భార్య బాధితుల్లో అతను ఒకరు. చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉండడంతో అర్ధాంగి నుండి ఎదురైన మానసిక వేదింపులు తట్టుకోలేక రక్షించాలంటూ ఏకంగా ప్రధానమంత్రికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాను ఈ విధంగా కూడా వాడేస్తున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మొహల్లా క్లినిక్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వారికి గైనకాలజీ పరీక్షలు మరియు మందులు ఉచితంగా లభిస్తాయి.
సబర్మతి నదిపైన గల అటల్ వంతెనపై గంటకు 3,000 మంది సందర్శకులను మాత్రమే అనుమతించాలని అహ్మదాబాద్ పౌర సంఘం నిర్ణయించింది.
పంజాబ్ లో స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విఫలం చెందారని వెంటనే ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
గుజరాత్ లో వంతెన కూలి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన మోర్బి ఘటనా సమయంలో ఓ వ్యక్తి సాహోసపేతంగా వ్యవహరించారు. నదిలో పడి గిలగిలా కొట్టుకుంటున్న ప్రజల్ని ప్రాణాలు కాపాడి మరణాల సంఖ్య తగ్గించాడు. అందరి ప్రసంశలు అందుకొన్నారు.
అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాత, చెన్నై మరియు దాని పరిసర జిల్లాల్లో విస్తృతంగా, భారీ వర్షాలు కురిశాయి.