Home / Latest Natioinal News
అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తో తమ బంధం ముగిసినట్లేనని ప్రకటించింది. సోమవారం తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఉత్తరాఖండ్లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్కు కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి దూరంగా ఒక రోజు గడిపినందుకు అతను తన 20 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో మేక కన్ను బగర్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక ఆలయంలో మేకను బలి ఇచ్చిన తరువాత ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
భారత వాతావరణ విభాగం (ఐఎండి) కేరళలో రుతుపవనాలు మూడు నుండి నాలుగు రోజులు మరింత ఆలస్యం అవుతాయని అంచనా వేసింది. కేరళలో సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాల ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది జూన్ 4న ప్రారంభమవుతాయంటూ మే 23 నాటి తన నివేదికలో ఐఎండి పేర్కొంది.
ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిరసన నిర్వాహకులు మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు నిరసన నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.
దుబాయ్కి వెళ్లే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టడంతో 160 మందికి పైగా ప్రయాణికులను దించాల్సి వచ్చింది. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏ)లో గురువారం ఉదయం 8.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య అధికారాన్ని పంచుకునే ఫార్ములా లేదని తన సహచర మంత్రి ఎంబీ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు.
తన రాష్ట్రంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. అయితే తమ పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
1994లో అప్పటి గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్కు మంజూరైన రిమిషన్కు సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.