Last Updated:

Punjab: కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లి.. పంజాబ్ లో ఒక తండ్రి ఘాతుకం

పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి దూరంగా ఒక రోజు గడిపినందుకు అతను తన 20 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.

Punjab: కుమార్తెను  కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లి.. పంజాబ్ లో ఒక తండ్రి ఘాతుకం

Punjab: పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి దూరంగా ఒక రోజు గడిపినందుకు అతను తన 20 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఒక రోజంతా ఇంటికి దూరంగా ..(Punjab)

నిందితుడిని కూలీగా పనిచేసే నిహాంగ్ సిక్కు బావుగా గుర్తించారు. ఈ ఘటన గురువారం జరగ్గా, నేరానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది.ప్రాథమిక విచారణలో నిందితుడు తన కుమార్తె పై అనుమానం వ్యక్తం చేసి హత్య చేసినట్లు తేలింది. బావు కూతురు బుధవారం ఇంట్లో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లి గురువారం తిరిగి వచ్చింది. దీనిపై బావు తన కుమార్తెపై కోపంతో ఇంటికి తిరిగి రాగానే పదునైన ఆయుధంతో ఆమెను కొట్టి హత్య చేశాడని ఓ పోలీసు అధికారి తెలిపారు.నిందితుడు తన కుటుంబ సభ్యులను ఇంటికే పరిమితం చేసి వారిని కూడా చంపేస్తానని బెదిరించినట్లు మాకు సమాచారం అందింది. భయం కారణంగా, వారు ఇంటి నుండి బయటకు రాలేకపోయారని పోలీసు అధికారి తెలిపారు.

నా మనుమరాలు ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె తనంతట తాను తిరిగి వచ్చింది. ఆమె తిరిగి వచ్చినప్పుడు తండ్రి కొట్టి చంపాడని ధితురాలి అమ్మమ్మ తెలిపింది. పోలీసులు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.